మనలో చాలా మంది ప్రశాంతత కోసం నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎందరో శ్రవణా నందం కలిగించే శబ్దాన్ని సంగీతం రూపంలో ఆస్వాదిస్తారు. పంచ భూతాల్లో శబ్దం అన్నింటికమే ముందు ఉంటుందని పండితులు చెబుతారు.
ఆ శబ్దం ఆకాశం నుంచి వస్తుంది. శబ్దానికి ఆధారం ఓం కారం. నిజానికి ఓం కారం ప్రతి దేహం లో ఉంటుంది. ‘ఓం’ అని శబ్దం చేయగానే, ఆ తరంగాల తో దేహం పులకిత మవుతుంది. ‘ఓం’ అన్నది మంత్రం కాదు. మత సంబంధ మైనది అసలే కాదు. వేదాల లో నిక్షిప్తమైన ఓం కార నాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం.
ప్రాచీన కాలం లో ఋషులు వాతవరణ ప్రతి కూల పరిస్థితులను తట్టుకుని ఉపవాస దీక్షల లో కూడా ఆరోగ్య వంతం గా ఉండటం వెనుక ఓం కార నాదమే రహస్యం. విదేశాల్లోని విశ్వ విద్యాలయాల్లో జరిపిన పరిశోధనల్లో సైతం ఓం కారం మృత్యుంజయ జపం అని బయటపడింది. ఓం కారాన్ని మతానికి ముడి పెట్టడం వల్ల ఓం కారం చేసే మేలు పరిమిత మవుతుంది.
ఓంకారం ఉచ్చరించడం వల్ల కలిగే ప్రయోజనాలు..
నాభి లోంచి లయ బద్ధం గా ఓం కార పదాన్ని పలక గలిగితే మానవుడి ఆరోగ్యం పరిపూర్ణం గా ఉంటుంది. ఓం కారం పదిహేను నిమిషాల పాటు ఉచ్చరించ గలిగితే రక్తపోటు తగ్గుతుంది. రక్త ప్రసరణ సక్రమం గా జరిగి గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. మానసిక అలసట, అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది.ఊపిరితిత్తుల పని తీరు మెరుగు పడుతుంది.జీర్ణ ప్రక్రియ సవ్యం గా సాగుతుంది.కిడ్నీ వ్యవస్థ క్రమ బద్ధం గా పని చేస్తుంది. థైరాయిడ్ పని తీరు ను క్రమ బద్ధం చేస్తుంది. ఓం కారంలో ఉన్న మహత్యం ఇదే.
(సేకరణ)