నిషేధం కాదు..మద్యం మీదే సంపూర్ణంగా ఆదాయం!:పవన్ ఎద్దేవా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విధానంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి..ఇప్పుడు ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తామన్నట్లు పరిస్థితి తయారైందని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.
రాష్ట్రంలో సారా బట్టీలు, బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివేనని.. ‘చిన్న గమనిక’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. వీటి ద్వారా అదనంగా వచ్చే రూ.వేల కోట్ల ఆదాయం కూడా వారికేనని ఆరోపించారు. ”అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు.. సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు” అంటూ బైబిల్‌ సూక్తిని ట్వీట్‌లో పవన్‌ జోడించారు.

Leave a Reply