Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ మేనిఫెస్టోని ప్రజలు నమ్మరు

– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ

వైసీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా, పారిశ్రామిక వృద్ధి, మెరుగైన మౌలిక వసతుల, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. పాత పథకాలనే కొనసాగిస్తూ ప్రజలని మరొక్కసారి హామీలతో మోసం చేయాలన్న ప్రయత్నం కనిపిస్తోంది. దేశంలో బిజెపి ప్రభుత్వం పారిశ్రామిక, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడంతో పెరిగిన ఆర్ధిక వ్యవస్థతో పేద, మధ్య తరగతి ప్రజలకు సంక్షేమం అందించింది. రాష్ట్రంలో కూడా 2014-19 మధ్య ప్రజలు అందుకున్న సంక్షేమం, అభివృద్ధిని ప్రజలు చూసారు. 2019-24 మధ్య వైసీపీ అవినీతి, అరాచక పాలనను చూసారు. 2019 ఇచ్చిన హామీలను వైసీపీ నెరవేర్చలేకపోయింది. ప్రజలు మళ్ళీ కూటమికి మద్దతు తెలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం.

LEAVE A RESPONSE