Suryaa.co.in

Andhra Pradesh

సుజనాను అత్యధిక మెజారిటీ గెలిపించుకుంటాం

మాల మహాసభ తీర్మానం

విజయవాడ పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని మాల మహాసభ తీర్మానించింది. మాలలు, అణగారిన వర్గాలపై సుజనా చౌదరి చూపుతున్న ఆత్మీయతకు తాము ఆకర్షితులయ్యామని, సుజనాకు మద్దతు ఇవ్వాలని తీర్మానించుకున్నామని మాల మహాసభ ఏపీ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు తెలిపారు.

భవానీ పురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా మాలలు అందరూ సుజనాకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. మాలలకు ఎన్నో పథకాలు ఇస్తానని చెప్పిన జగన్ అందరినీ మోసం చేశారని, ఆయన వెనుక ఉన్నది ఫ్యాక్షనిస్టులు, హంతకులే అని దుయ్యబట్టారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించిన చందంగా జగన్ మాలలకు అన్యాయం చేశారని వెంకట్రావు విమర్శించారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు పెట్టి నిధులు ఇచ్చి ఒక్క మాలలను మాత్రం నిర్లక్ష్యం చేశారని వెంకట్రావు విమర్శించారు. సుజనాను గెలిపించాలని మాలలకు మల్లెల వెంకట్రావు పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE