Suryaa.co.in

Andhra Pradesh

ప్రశాంత్ కిషోర్ మాట మార్చారు

-అందరూ షాకయ్యేలా జూన్ 4న ఫలితాలు
-ఐ ప్యాక్ టీమ్‌తో సీఎం జగన్

విజయవాడ: రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మాట మార్చారని సీఎం జగన్ అన్నారు. ఈసారి వైసీపీకి అధికారం రాదని పీకే ఇటీవల చేసిన వ్యాఖ్యలపై జగన్ స్పందించారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఐప్యాక్ ఎంతో సాయపడిందని, ఐప్యాక్ సూచనలను గత 5ఏళ్ల పాలనలోనూ అమలు చేశామని చెప్పారు. దేశంలో అందరూ షాకయ్యేలా జూన్ 4న ఫలితాలు వస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల నేతలు ఏపీనే చూస్తారన్నారు.

LEAVE A RESPONSE