Suryaa.co.in

Andhra Pradesh

విశాఖలో చెవిరెడ్డి స్కామ్ వెయ్యి కోట్లు

-ఋషికొండలో తవ్విన వందల కోట్ల గ్రావెల్ పోర్టుకు అమ్మకం
-పెందుర్తి గుర్రంపాలెం లో ఎ.పి.ఐ.ఐ.సి చెందిన 200 ఎకరాల్లో అక్రమ మైనింగ్
-మధురవాడ బక్కన్నపాలెంలొ 208 కోట్ల అక్రమ టీడీఆర్
జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్

విశాఖపట్నం,మే 16: నిత్యం దైవ నామస్మరంలో ఉన్నట్లు కనిపించే వైసీపీ శాసనసభ్యుడు,ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోటరీలో ముఖ్యుడు అయిన చంద్రగిరి ఎం ఎల్ ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకు ఏమాత్రం సంబంధం లేని విశాఖకు వేయి కోట్ల రూపాయలకు పైగా పంగనామాలు పెట్టారు. క్రైస్తవుడైన ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను హిందువులు వ్యతిరేకించకుండా ఆయన ఇంట్లో గోశాల ఏర్పాటు చేసి పదేపదే ఆలయ సెట్లు నిర్మించి ఆ పలుకుబడితో విశాఖలో భారీ స్కాములు చేసేశారు.

ఋషికొండ విధ్వంసకారుడు,వ్యాపారి ఆయనే
బినామీలతో ఋషికొండను విధ్వంసం చేయించిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి వేల లారీల గ్రావెల్ తో వందల కోట్లు సంపాదించారు. ఋషికొండను తవ్వగా వచ్చిన గ్రావెల్ రాళ్లను నిబంధనలకు విరుద్ధంగా సముద్రం ఒడ్డున సి ఆర్ జెడ్ ప్రాంతంలో డంపు చేయించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడి ఎర్ర మట్టిని మాత్రం విశాఖ పోర్టుకు తరలించి భారీగా లబ్ధి పొందారు.

గంగవరం పోర్టు అధినేత ముఖ్యమంత్రి జగన్ కి సన్నిహితులు కావడం, స్వయంగా కారు చౌకుగా పోర్ట్ లోని విక్రయించడానికి చెవిరెడ్డి సొమ్ము చేసుకొని మట్టి కాంట్రాక్ట్ తెచ్చుకున్నారు. ఆ కారణంగానే ఋషికొండపై అవసరం లేని చోట, నిర్మాణాలు లేని చోట కూడా లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వి అమ్ముకున్నారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో ఆదాని నిర్మిస్తున్న బెర్త్ లు అవసరాల కోసం వందల కోట్ల విలువైన ఈ మట్టిని తరలించి అమ్ముకొని సొమ్ముచేసుకున్నారు.

పెందుర్తి గుర్రంపాలెంలో భారీ స్కాం
తనకు ఏమాత్రం సంబంధం లేని పెందుర్తి నియోజకవర్గం గుర్రంపాలెంలో 200 ఎకరాల్లో క్వారియింగ్ చేసి వందల కోట్లు సంపాదించారు. ప్రభుత్వం పరిశ్రమలుకని కేటాయించిన ఈ భూమిలో చాలా తెలివిగా మైనింగ్ చేశారు. ఈ ప్రాంతం లొ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం కాదని ప్రభుత్వ అధికారులతోనే సర్టిఫై చేయించి తన మైనింగ్ అవసరాలకు వాడుకున్నారు.

కేవలం మైనింగ్ చేసేందుకే ఈ భూమిని పరిశ్రమలకు పనికి రాదని పలుకుబడితో సర్టిఫై చేయించారు. ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి రోజా ఏపీఐఐసీ చైర్మన్గా ఉండగా ఈ భూములకు నాట్ ఫిట్ ఫర్ ఇండస్ట్రీస్ అనే సర్టిఫికెట్ మంజూరు చేయించి దాని ఆధారంగా ఆ భూముల్లో మైనింగ్ చేసి సొమ్ము చేసుకున్నారు.

బక్కన్నపాలెం లో రెండు వందల కోట్ల టిడిఆర్
ఆంధ్ర ,తెలంగాణల్లో తాను చేస్తున్న సర్వేలకు డబ్బు కావాలంటూ మధురవాడ సమీపంలోని బక్కన్నపాలెం సర్వే నెంబర్ 2 లొ 208 కోట్ల టిడిఆర్ బాండ్లను తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిడితో దక్కించుకున్నారు.నిబంధనలకు విరుద్ధంగా మహావిశాఖ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు కేవలం చెవిరెడ్డికి లబ్ధి చేకూర్చేందుకు టి.డి.ఆర్ బాండ్లు మంజూరు చేశారు. ఇది అక్రమమంటూ ఫిర్యాదుల వెళ్లినా, తమకూ తెలిసినా తాడేపల్లి ప్యాలెస్ వత్తిడికి తలొగ్గారు.

ఫార్మాసిటీలో డంపులు
పరవాడ లోని ఫార్మాసిటీలో పలువురు పారిశ్రామికవేత్తలను బెదిరించి,భయపెట్టి రసాయన వ్యర్ధాల డంపులను చెవిరెడ్డి స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్చార్జిగా పనిచేసిన రాజ్యసభ సభ్యుడు పి. విజయ్ సాయి రెడ్డి ద్వారా ఈ డంపులతో వ్యాపారం చేసుకొంటున్నారు. ఈ కారణంగానే ఫార్మీ సిటీలో తరచూ ప్రమాదాలు జరిగినా అధికారులు ధైర్యంగా ఎవరిపైనా చర్యలు తీసుకోలేక పోతున్నారు.

చెవిరెడ్డి బాటలో ఇంకెందరో..?
తిరుపతి జిల్లా చంద్రగిరి శాసనసభ్యుడిగా ఉన్న చెవిరెడ్డి విశాఖకు వచ్చి ఐదేళ్లలో 1000 కోట్లకు పైగా వ్యాపారం చేశారంటే ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనలో దోపిడీ ఎంతగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వైయస్ జగన్ దోపిడి బృందం ఆస్తులను దోచుకుని ప్రకృతి వనరులను ధ్వంసం చేసింది. వీటన్నిటి పైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాం.

రానున్న కూటమి ప్రభుత్వంలో వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కూటమి అధినేతలకు విజ్ఞప్తి చేస్తాం.ఈ సమావేశంలో జనసేన చోడవరం నియోజకవర్గ ఇంచార్జి పి వి స్ న్ రాజు,ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయ కర్త నాగలక్ష్మి చౌదరి,టీడీపీ జోన్ కోఆర్డినేటర్ పోతన్నరెడ్డి,వార్డు అధ్యక్షుడు పోతు వెంకట ప్రసాద్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE