Suryaa.co.in

National Telangana

దలైలామాకు పీవీ మెమోరియల్‌ అవార్డ్‌

దివంగత భారత మాజీ ప్రధాని, భారతరత్న పి.వి.నరసింహారావు మెమోరియల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక పి.వి.నరసింహారావు మెమోరియల్‌ అవార్డును ప్రపంచ శాంతి దూత దలైలామా కు అందజేశారు. ధర్మశాలలోని దలైలామా నివాసంలో బుధవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. పీవీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు, ఆల్‌ ఇండియా యాంటీ టెర్రరిస్ట్‌ ఫ్రంట్‌ చైర్మన్‌ మణీందర్‌జీత్‌ సింగ్‌ బిట్టా, పీవీ మనవడు పి.వి.ఆర్‌.కశ్యప్‌, హైదరాబాద్‌కు చెందిన సివిల్‌ సర్వీసెస్‌ ర్యాంకర్‌, సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమీ డైరెక్టర్‌ బాలలత మల్లవరపు, పీవీ ఫౌండేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎం.అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

దివంగత పీవీ స్మారక అవార్డును అందుకుంటున్నందుకు దలైలామా హర్షం వ్యక్తం చేశారు. శాంతి ద్వారానే ప్రపంచం మనుగడ సాగించగలదని, పీవీ ప్రపంచశాంతి కోసం చేసిన సేవలను ఆయన కొనియాడారు. పీవీఆర్‌ కశ్యప్‌, ఫౌండేషన్‌ ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ అవార్డును గతంలో సబర్మతి ఆశ్రమం, రతన్‌ టాటాకు ఇవ్వడం జరిగిందని, మూడోసారి దలైలామాకు ఇచ్చినట్లు తెలిపారు.

LEAVE A RESPONSE