సీఎం జగన్ పర్యటనపై రఘురామ వ్యంగ్యాస్త్రాలు

న్యూ ఢిల్లీ : సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధానితో భేటీ తర్వాత ప్రత్యేక హోదా, పోలవరంపై చర్చించామని సీఎం జగన్‌ ప్రకటించుకుంటారని చెప్పారు. అయితే తనకున్న సమాచారం మేరకు తన విషయంతో పాటు బెయిల్‌ అంశంపై మాట్లాడతారని చెప్పారు. సినిమా టికెట్ల ధరలపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. దిల్లీలో రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధానిని కలుస్తానని సీఎం జగన్ ఢిల్లీ వస్తున్నారు. ప్రధానితో ఫలవంతంగా ముగిశాయని చెబుతారు. ప్రత్యేక హోదాపై చర్చించామంటారు. మోడీతో 20నిమిషాలు భేటీ అయితే బయట వేచి ఉన్న సమయంలో కలిపి గంట చర్చించామంటారు’’ అని రఘురామ అన్నారు.

Leave a Reply