Suryaa.co.in

Andhra Pradesh

శ్రీవారిని దర్శించుకున్న రఘురామకృష్ణంరాజు

వైసీపీ 25 నుంచి 40 సీట్లకే పరిమితమని వ్యాఖ్య

ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు శుక్రవారం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనానం తరం అయన మాట్లాడుతూ ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 125 నుంచి 150 సీట్లలో కూటమి గెలుస్తుందని, వైసీపీ మాత్రం 25 నుంచి 40 సీట్లకు పరిమితమవుతుందని తెలిపారు. స్వామి సన్నిధిలో అబద్ధాలు మాట్లాడనని, జగన్‌ మాట నిజమవుతుందో లేక తన మాట నిజమవుతుందో జూన్‌ 4వ తేదీన తెలుస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి మంచిరోజులు రావాలని, సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు వెల్లడిరచారు.

LEAVE A RESPONSE