ప్రైవేట్ భూముల గోల్ మాల్ రిజిస్ట్రేషన్ కేసును చేధించిన పోలీసులు

చిత్తూరులో జరిగిన 50 కోట్ల రూపాయల విలువ గల ప్రైవేట్ భూముల గోల్ మాల్ రిజిస్ట్రేషన్ కేసును చేధించిన పోలీసులు. అందుబాటులో లేని భూమి యజమానుల కన్ను గప్పి , రిజిస్ట్రేషన్ , రెవెన్యూ శాఖ లోని డొల్లతనాన్ని ఉపయోగించుకొని కోట్లు గడించాలని ప్రయత్నించిన అతిపెద్ద ముఠా. 12 మందిని గత వారం రోజులుగా విచారణ. మొత్తం 9 అతి విలువైన భూములను నకిలీ రిజిస్ట్రేషన్ ద్వారా ఇతురులకు ధారదత్తం చేసిన నిందితులు. అందులో మొదటి కేసులో 7 గురు డాక్యుమెంట్ రైటర్ , వీఆర్వో, మహిళతో కూడిన ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు. మిగిలిన కేసుల్లో విచారణ జరుపుతున్న పోలిసులు. విచారణల్లో పలువురు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఎమ్మార్వోలు, సబ్ రిజిస్ట్రార్ లు , బడా వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖుల పాత్ర ఉన్నట్టు సమాచారం . గోప్యంగా విచారణ జరుపుతున్న పోలీసులు.

మెట్రో సిటీలలో జరిగే భూదందాలను తలదన్నే విధంగా స్కాం కు తెగబడ్డ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలోని కొందరు అక్రమార్కులు. ఖాళీ భూములు , యజమానులు విదేశాల్లో ఉన్న భూములు, వారసులు లేని భూములు లే ఈ అక్రమార్కులకు జాక్ పాట్. ఇందులో కొసమెరుపు అక్రమ రిజిస్ట్రేషన్ ద్వారా పొందిన ఇందులో ఒక భూమిని బెంగళూరు లోని సిటీ యూనియన్ బ్యాంక్ లో 18 కోట్లు లోను పొందిన నరసింహులు నాయుడు అనే పరారీ లో ఉన్న నిందితుడు , లోతుగా విచారణ జరుపుతున్న పోలీసులు

Leave a Reply