గత ఏడాది ఖరీఫ్ కరువు, మిచౌంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపునకు ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. రూ.1,289 కోట్ల విలువైన ఇన్పుట్ సబ్సిడీని చెల్లించేందుకు ఈ ఏడాది మార్చి 6న సీఎం జగన్ బటన్ను నొక్కారు. అయితే ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. ఎన్నికలు ముగిసే వరకు చెల్లింపులు వాయిదా వేయాలని ఆదేశిం చింది. ఎన్నికలు ముగియడంతో కరువు బాధిత రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.847 కోట్ల చెల్లింపునకు ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలుపుతూ బడ్జెట్ను విడు దల చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కరువు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ట్రెజరీ నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. మిచౌంగ్ తుఫాన్కు సంబంధించి ప్రభుత్వం ఇంకా నిధులు మంజూరు చేయలేదు.
Devotional
బ్రహ్మ కడిగిన పాదం
– ఏమిటా సందర్భం? పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగ- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి…
అక్షయ తృతీయ రోజునే చందనోత్సవం ఎందుకు ?
సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజరూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ? పూర్వం తన భక్తుడైన…
Sports
అథ్లెటిక్స్ క్రీడాకారులతో ముచ్చటించిన మోదీ
న్యూఢిల్లీ: ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ 2024లో పాల్గొనేందుకు పారిస్ వెళ్తోన్న భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ముచ్చటించారు. జట్టులో మొత్తం 28 మంది సభ్యులుండగా గత ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా భారత్కు నాయకత్వం వహిస్తున్నారు.క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన…
ఐసీసీ ఛైర్మన్గా జై షా?
ఐసీసీ ఛైర్మన్గా జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్ బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురులేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా…