– సెలవు తీసుకుని మనసు కుదుటపడిన తర్వాతనే బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది
– ఆందోల్ మాజీ ఎం ఎల్ ఏ క్రాంతి కిరణ్ సలహా
హైదరాబాద్: కెసిఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. గౌరవప్రదమైన హోదాలో ఉన్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోని ప్రతి పౌరుడి సంక్షేమాన్ని కోరుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకోవాలి. కానీ అలా కాకుండా తెలంగాణ ఉద్యమానికి సారధ్యం వహించిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ని మార్చరీలోకి త్వరలో పోతారు అంటూ ముఖ్యమంత్రి మాట్లాడడం చాలా విచారించదగ్గ విషయం.
విజ్ఞత కలిగిన వ్యక్తులు ఎవరు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడరు. కేసీఆర్ సీనియర్ నాయకుడే కాదు వయసులో కూడా రేవంత్ రెడ్డి కంటే చాలా పెద్దవారు. అతనికంటే ముందే ఎం ఎల్ ఏ గా ఎం పి గా కేంద్ర మంత్రిగా , ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కెసిఆర్ . అట్లాంటి వ్యక్తి పట్ల గౌరవాన్ని ప్రదర్శించకుండా మాట్లాడటం సమంజసం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి హితువు పలుకుతున్నా.
అందుకే కొన్ని రోజులు మెడిటేషన్ చేసి లేదా సెలవులు తీసుకుని మనసు కుదుటపడిన తర్వాతనే బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది అని సలహా ఇస్తున్నాను. కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని కె సి ఆర్ కి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.