Suryaa.co.in

Andhra Pradesh

రహదారులా?మృత్యు మార్గాలా?

-టీడీపీ హయాంలో రూ.3,690కోట్లతో 6,694 కిలోమీటర్ల రోడ్లేస్తే, మంత్రిపెద్దిరెడ్డి కేవలం 330కిలోమీటర్లని దుష్ర్పచారంచేస్తున్నాడు
– వైసీపీ సర్కారుపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్
రాష్ట్రంలో రోడ్లన్నీ నరకకూపాల్లా మారిపోయాయని, రోడ్లపై ప్రయాణించాలంటే వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన దుస్థితి దాపురించిందని, ఆఖరికి గాయాలపాలైన వారిమూలంగా వైద్యులకుపనిపెరిగిందని, ఈ మాట స్వయంగా భీమవరం వైసీపీఎమ్మెల్యేనే చెప్పారని, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..
రాష్ట్రంలో ఆర్ అండ్ బీ శాఖ మూతపడింది. వాహనదారులు గుంతల్లో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నా ప్రభుత్వంలో చలనంలేదు. టీడీపీప్రభుత్వంలో మొదలైన రూ.4,500 కోట్లపనులను ఈ ప్రభుత్వం రాగానే ఆపేసింది. టీడీపీప్రభుత్వం, ఎన్ డీబీ కింద రూ.6400కోట్ల రుణానికి అనుమతులు తీసుకొస్తే, ఈ ప్రభుత్వం 30శాతంవాటా చెల్లించలేక, వాటిని పోగోట్టుకుంది. 20, 30 సంవత్సరాలకు చేసే చెల్లింపులుకూడా చేయలేమంటేఎలా? రాష్ట్రవాటాకింద చెల్లించాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేని దుస్థితికి జగన్ ప్రభుత్వం వచ్చింది. మంత్రులేమో తమపదవులుఎన్నాళ్లుంటాయోనన్న ఆందోళనలో వారిశాఖలను పూర్తిగా గాలికొదిలేశారు. మంత్రి శంకర్ నారాయణకు ఏఈబీ, ఎన్ డీబీ అంటే ఏంటి, ప్లాన్ కు నాన్ ప్లాన్ కు ఉన్నవ్యత్యాసమేంటో కూడా తెలియదు.
ఒకసంవత్సరంలో రోడ్లన్నీ వేసేస్తామని మంత్రి శంకర్ నారాయణ చెప్పడం హాస్యాస్పదంగాఉంది. పీఎంజేఎస్ వై కింద టీడీపీప్రభుత్వంలో 2,634కిలోమీటర్ల వరకు రోడ్లనిర్మాణం చేశాం. ఎస్సీ సబ్ ప్లాన్ కింద, రూ.848కోట్లతో 1370కిలోమీటర్ల రోడ్లు, రూ.711కోట్ల నరేగానిధులతో 2,230కిలోమీటర్లవరకు రోడ్లు వేయడం జరిగింది. టీడీపీప్రభుత్వంలోనే రూ.594కోట్లతో 1277 కిలోమీటర్ల గ్రావెల్ రోడ్లను బీటీరోడ్లుగా మార్చడంజరిగింది. 250కు పైబడి జనాభాఉండే రోడ్డుసౌకర్యంలేని గ్రామాలకు, రూ.408కోట్లతో రోడ్లువేయడంజరిగింది. ఆర్ అండ్ బీ , పంచాయతీ రాజ్ శాఖలపరిధిలో, మొత్తంగా రూ.3,690కోట్లతో 6,694 కిలోమీటర్లవరకు రోడ్లను టీడీపీప్రభుత్వం వేయడం జరిగింది. ప్లాన్ లో మూడురకాలుంటాయి, అవి ఎమ్ డీఆర్ (మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, కోర్ నెట్ వర్క్ (హెవీట్రాఫిక్ రోడ్స్) ఆర్ ఆర్ (రూరల్ రోడ్స్). ప్లాన్ కింద ప్రతిఏటా రూ.1000కోట్లు ఖర్చుచేస్తే, నాన్ ప్లాన్ అంటే గతుకులు పూడ్చటం, ఇతరమరమ్మతులకు ప్రతిఏటా రూ.500కోట్లనుంచి రూ.600కోట్లవరకుఖర్చుపెట్టాం.
అవికాకుండా పంచాయతీరాజ్ శాఖలో రూ.4,500కోట్లరుణాన్ని ఏఈబీ ద్వారా తీసుకొచ్చాము. ఆరుణంతో పనులుచేయడానికి 44ప్యాకేజీ కింద టెండర్లు పిలవడంజరగడమేకాక, దాదాపు రూ.600కోట్లవరకు ఖర్చుచేయడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక, రాష్ట్రవాటాచెల్లించాల్సివస్తుందని ఆ పనులన్నింటినీ ఆపేయించింది. 44ప్యాకేజీ కింద నెల్లూరులో చిత్తూరులో పనులు జరిగితే, పనులుచేసిన కాంట్రాక్ట్ సంస్థలన్నింటికీ ఈప్రభుత్వం నిధులు ఆపేసింది. 11జిల్లాల్లో జరుగుతున్న పనులన్నింటినీ ఆపేశారు. నాబార్డ్ కింద వైసీపీప్రభుత్వం రూ.1100కోట్ల నిధులు పొంది, వాటిలో 30శాతంచెల్లించాల్సి వస్తుందని, మొత్తం పనులను ప్రీక్లోజర్ చేసేశారు. ప్రీక్లోజర్ చేయడానికి ఏపీ ఆర్థికశాఖ కొత్తకొత్త నిర్వచనాలుచెబుతోంది. ఒక్కసారి పనులు ప్రారంభమై తిరిగి ప్రీక్లోజర్ చేస్తే, తిరిగి ఐదేళ్లపాటు ఆపనులను చేయడానికి వీల్లేదనే నిబంధనతీసుకొచ్చింది. ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉంటుందా? రోడ్లుభవనాలశాఖ, పంచాయతీ రాజ్ శాఖల పరిధిలో టీడీపీప్రభుత్వంలో ప్రారంభమైన రోడ్లనిర్మాణపనులన్నింటినీ ఆపేశారు.
పీఎంజేఎస్ వై కింద 330కిలోమీటర్లు మాత్రమే గతప్రభుత్వంలో రోడ్లువేసినట్లు మంత్రిపెద్దిరెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కేవలం రోడ్లనిర్మాణానికి ఐదేళ్లలో రూ.820కోట్లు మాత్రమే ఖర్చుచేసిందని సాక్షి పత్రిక దుష్ప్రచారం చేస్తోంది. వైసీపీప్రభుత్వ నొక్కుడు భరించలేకే కాంట్రాక్టర్లుఎవరూ రోడ్లువేయడానికి, టెండర్లలో పాల్గొనడానికి ముందుకురావడంలేదు. సీఎఫ్ఎంఎస్ పద్ధతిలో టీడీపీప్రభుత్వం కాంట్రాక్టర్లకు పారదర్శకంగా చెల్లింపులుచేసింది. ఇప్పుడేమో ఎవరుడబ్బులిస్తే, వారికే కాంట్రాక్టులు, చెల్లింపులు అంటున్నారు. పిక్ అండ్ పే పద్ధతిని ఫాలో అవుతున్నారు.ఆర్థికశాఖ అధికారి సత్యనారాయణ, 15శాతం చెల్లింపులు చేసేవారికే బిల్లులు చెల్లిస్తున్నారు.
టీడీపీప్రభుత్వంలో అమలైన ఫస్ట్ ఇన్, ఫస్ట్ అవుట్ విధానానికి స్వస్తి పలికారు. సీఎంవో లంచాలిచ్చే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో లేదు. ఏ ఫైల్ క్లియర్ చేయాలన్నా, సత్యనారాయణ 90రోజుల సమయం తీసుకుంటారని చెబుతున్నారు. సీఎఫ్ఎంఎస్ విధానాన్ని నాశనంచేసే అధికారం సత్యనారాయణకు ఎవరిచ్చారు? అలాంటప్పుడు ఈ పద్ధతినే ఈ ప్రభుత్వం తీసేయొచ్చుకదా? మంత్రి బుగ్గన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆర్థికశాఖా మంత్రి బిల్లులచెల్లింపునకు సంబంధించి ఆదేశాలివ్వడానికి లేదని నేరుగా సీఎంవో నుంచే ఆదేశాలిచ్చారు. ప్రజలప్రాణాలతో ఆడుకునే అధికారం ఈప్రభుత్వా నికి ఎవరిచ్చారు? రాష్ట్రానికి దుర్గతి పట్టించారు. ఈ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరకొచ్చింది. ప్యాచ్ వర్క్ చేయడానికి జనసేన ముందుకొస్తే, ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమిటి?

LEAVE A RESPONSE