సిబిఐ దత్తపుత్రుడికి ప్రధాన బ్రోకర్…సజ్జల రామకృష్ణారెడ్డి

•సాధారణ జర్నలిస్టు నుంచి వేల కోట్లు ఎలా సంపాదించారు?
•ఎన్ని బ్రోకర్ పనులు చేసి ఆ స్థాయికి ఎదిగారో అందరికీ తెలుసు
•ఎ-1 జగన్… బి-1 సజ్జల
•జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డి, ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్

సాధారణ జర్నలిస్టుగా అరకొర జీతంతో జీవితం మొదలుపెట్టిన సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ రోజు వేల కోట్ల రూపాయల ఆస్తి ఎలా సంపాదించారో… అందుకు ఎన్ని బ్రోకర్ పనులు చేశారో అందరికీ తెలుసు అని జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డి చెప్పారు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కి జర్నలిస్టులు అంటే ఎంతో గౌరవం… అదే గౌరవాన్ని సజ్జలకి ఇచ్చేవారన్నారు. సజ్జల అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూ తన గౌరవాన్ని తానే పోగొట్టుకొంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సిబిఐ దత్తపుత్రుడు… ఆయన కోసం బ్రోకరిజం చేస్తున్న వ్యక్తిని ఏమని పిలవాలి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఎలా ఎదిగారో ప్రతి ఒక్కరికీ తెలుసు అన్నారు.

•సన్నిహిత ఎమ్మెల్యేకు మంత్రి పదవి కోసం సజ్జల బ్రోకరిజం: షేక్ రియాజ్
ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మాట్లాడుతూ “అవినీతి పెట్టుబడులతో పుట్టిన సాక్షి పత్రికను అడ్డుపెట్టుకొని సజ్జల చేసిన బ్రోకర్ పనులేమిటో తెలియని నాయకులు ఉండరు. మైనింగ్ వ్యవహారాల్లో అవినీతికి పాల్పడ్డారు. సి.బి.ఐ.దత్తపుత్రుడు జగన్ రెడ్డి ఎ-1 అయితే… బ్రోకర్ పనులు చేసే సజ్జలను బి-1 అని పిలుస్తాం. సజ్జల ప్రధాన సలహాదారు కాదు.. సిబిఐ దత్తపుత్రుడికి ప్రధాన బ్రోకర్. జగన్ కోసం సజ్జల చేస్తున్న బ్రోకర్ పనులు ఏమిటో వైసీపీలో ఏ మంత్రిని అడిగినా… ఏ వైసీపీ ఎమ్మెల్యేను అడిగినా చెబుతారు. తను చేసే బ్రోకర్ పనులకు ఎవరూ అడ్డు రాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలను సైతం సిఎం ఆఫీసుకీ, ఇంటికీ దూరం పెట్టింది సజ్జల కాదా? పొత్తుల విషయంలో వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోంది అని బీజేపీ నాయకులు చెప్పారు. వారి మాటలకు సమాధానం చెప్పే దమ్ము ఎ-కీ, బి-1కీ లేదు. ఆ దమ్ములేక, చేతగాక మా పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ మీదా, మా పార్టీ మీదా బురద జల్లుతున్నారు.

రాష్ట్రంలో వస్త్ర వ్యాపారాన్ని గుప్పిట్లో పెట్టుకోవడానికి సజ్జల, ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న తెర వెనక వ్యవహారాలను త్వరలోనే బయటపెడతాం. సజ్జల తనకు సన్నిహితంగా ఉండే ఓ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇప్పించేందుకు బ్రోకరిజం చేశారని వైసీపీలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆ సన్నిహిత ఎమ్మెల్యేను సజ్జల ఇంట్లో వాళ్ళు కొట్టిన మాట నిజమా కాదా? 2019కి ముందు విజయవాడలో ఒక హోటల్లో తిష్ట వేసి బ్రోకర్ పనులు చేసిన మాట వాస్తవం కాదా? మరోసారి సజ్జల మా అధ్యక్షులు మీదా, మా పార్టీ మీదా ఇలాగే మాట్లాడితే మరిన్ని విషయాలు బయటపెడతాం. సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యవహారాలపైనా, ఆయన చేస్తున్న బ్రోకరు పనులపైనా తక్షణమే సిబిఐ విచారణ చేయించాలనీ, సజ్జల ఆస్తులపై ఈ.డీ. కూడా దృష్టిపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రధాన బ్రోకర్ సజ్జల ఒకటి గుర్తుపెట్టుకోవాలి… ఈ రోజు కాకపోయినా భవిష్యత్తులో తప్పనిసరిగా అవినీతి వ్యవహారాలపై కచ్చితంగా జైలుకు వెళ్లక తప్పదు” అన్నారు.

•రోజాను తరిమి కొట్టే రోజులు వస్తాయి: పొన్నూరి శిరీష
తెలంగాణ వీర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పొన్నూరి శిరీష మాట్లాడుతూ “ఏపీ మంత్రి రోజా విషయాలు ఏమిటో అందరికీ తెలుసు. నిస్వార్థపరులైన మా అధ్యక్షులు పవన్ కల్యాణ్ గురించి మాట్లాడే అర్హత ఆమెకు ఏ మాత్రం లేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేస్తున్న వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చే సమస్యే లేదు. రోజాను నగరి ప్రజలు తరిమితరిమి కొట్టే రోజులు రాబోతున్నాయి. అప్పుడు మళ్ళీ జబర్దస్ట్ షోల్లో కూర్చోక తప్పదు. మా అధ్యక్షులు పవన్ కల్యాణ్ గురించి మరోసారి మాట్లాడితే మా వీర మహిళలు తరిమి కొడతారు” అన్నారు.

Leave a Reply