లోకేశ్ పాదయాత్రచూసి జగన్ కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాడు : జీ.వీ.రెడ్డి

ప్రతిపక్షాన్నిచూసి ఈస్థాయిలో భయపడే ముఖ్యమంత్రిని ఇప్పుడేచూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి శాడిజంతో లోకేశ్ యాత్రచూసి ఓర్వలేక కళ్లల్లోనిప్పులు పోసుకుంటున్నాడు. యువగళం యాత్రపై ఈర్ష్యాద్వేషాలతో, అసూయతో ఈ విధంగా కుళ్లి, కృశించిపోయే ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది లేకుండా పాదయాత్ర చేసుకోవాలనే నిబంధనతో పాటు, కేవలం రెండు నిబంధనలే పెట్టింది. కానీ జగన్ రెడ్డి మాత్రం ఇప్పుడు లోకేశ్ పాదయాత్రకు 18 నిబంధనలు పెట్టాడు. రోజుకో కొత్తనిబంధనను డీజీపీతో పనిలేకుండా స్థానిక పోలీసులే తెరపైకి తెస్తున్నారు. పాదయాత్రకు అనుమతికోరితే స్థానిక పోలీసులు వెంటనే అనుమతులు ఇవ్వడంలేదు. 400రో జులు, 4వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారని చెప్పాకకూడా ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడంఏమిటి? లోకేశ్ పాదయాత్రకు భయపడే ప్రభుత్వం మౌఖికంగా 18 నిబంధనలు పెట్టిందా? రోజూ ఏపూటకు ఆ పూట అనుమతి తీసుకోవాలని చెబుతోందా? బందోబస్త్ కల్పనలో పోలీసులు పూర్తి గా వైఫల్యం చెందారు. పోలీసులే పాదయాత్రప్రాంతంలో డ్రోన్లు ఎగరేయడమేంటి? డ్రోన్ల సాయంతో పాదయాత్రలో ఏం వేస్తారో, ఏంచేస్తారోననే సందేహం కలుగుతోంది

పాదయాత్రకు ఎంతమంది జనం వస్తున్నారో తెలుసుకోవడానికి డ్రోన్లు ఎగరేస్తు న్నామని పోలీసులు అంటున్నారు. జనాలతో పోలీసులకేం పని? ఎంతమంది వస్తున్నారో, యాత్ర ఎలాజరుగుతుందో తామే ఎప్పటికప్పుడు వీడియోలతో కూడిన సమాచారం ఇస్తున్నాంకదా.! పోలీసులే ఇలా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే ఎలా? పాదయాత్రకు వచ్చే వాహనాల్ని కూడా పిచ్చిపిచ్చి కారణాలతో అడ్డుకుంటున్నారు. వాహనాల నెంబర్లు చెప్పాలని, వచ్చేవారి వివరాలు చెప్పాలని పోలీసులు వేధిస్తున్నారు. ఒకరకంగా పోలీసులే ఓవరాక్షన్ తో తలాతోక లేని నిబంధనలతో పాదయా త్రకువచ్చే ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మైక్ లేకుండా ఎలా మాట్లాడ తారో పోలీసులు చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్రలో నోరేసుకొని కేకలు వేశాడా? లోకేశ్ మైక్ తో మాట్లాడితే మీకు వచ్చిన ఇబ్బందేమిటి? చూడబోతే రేపు ప్రార్థనామందిరాల్లో కూడా మైకులు పెట్టొద్దని చెప్పేలా ఉన్నారు. జనం భారీగా వచ్చినప్పుడు వారికి కనిపించకుండా లోకేశ్ ఎలా మాట్లాడతారు? ఒక నాయకుడు ఎవరైనా ప్రజల్లోకి వెళ్లినప్పుడు వాహనంపైనుంచో, వేదికమీదనుంచే కదా మాట్లాడే ది. ఆఖరికి లోకేశ్ స్టూల్ పై నిలబడి మాట్లాడితే, అదికూడా లాగేస్తున్నారు. ఇవన్నీ పిచ్చిపాలనకు పరాకా ష్టలు. డ్వాక్రామహిళలు పాదయాత్రకు వస్తున్నారని, లోకేశ్ గారు వచ్చేప్రాంతానికి, అదేసమయంలో మీటింగ్ ల పేరుతో వారిని అడ్డుకుంటున్నారు. కార్యకర్తలు పాదయాత్రకు వస్తే వారిపై హత్యాయత్నం కేసులుపెడతారా? మున్ముందు రేప్ కేసులు కూడా పెడతా రేమో? పాదయాత్ర 400రోజులు పూర్తయ్యే లోపు పోలీసులు ఐపీసీ చట్టంలోని అన్నిసెక్షన్లతో కేసులు పెట్టేలాఉన్నారు. లోకేశ్ భవనాలపైకి ఎక్కి మాట్లాడతారేమో అని ముందే ఇళ్లు, అపార్ట్ మెంట్ల యజమానుల్ని బెదిరిస్తున్నారు.”

వ్యాపారంలో నీకున్న అనుభవం మా లోకేశ్ కు లేదని కుళ్లుకోకు రోజక్కా. లోకేశ్ ను పిత్రీగిత్రీ అంటే నిన్ను, మీ మంత్రుల్ని చాలాచాలా అనాల్సి వస్తుందక్కో. : ఆనం వెంకట రమణారెడ్డి
“అక్కా… రోజక్కా మీ ఊరికి వచ్చాను. నీ నియోజకవర్గంలో నువ్వెంత పాపులర్ అక్కా? నీ ప్లెక్సీ కూడా ఒక్కటి కనిపించడంలేదు. రోజక్కా.. లోకేశ్ ను పిత్రిఅన్నావు. నీలాగా లావుగా లేడని పిత్రి అన్నావా? లేక నీలాగా మేకప్ వేసుకోలేదని లోకేశ్ ను పిత్రీ అన్నావా? లోకేశ్ హ్యాండ్సమ్ బాయ్. అతన్నిచూసి కుళ్లుకోకు అక్కా. నీవు జరి పే వ్యాపారంలో నీకున్న అనుభవం కూడా మాలోకేశ్ కు లేదక్కా. నువ్వు ఇంటర్ (హెచ్.ఈ.సీ.) చదివావు. అదికూడా పూర్తిచేయలేదు. లోకేశ్ చదివిన స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ నువ్వుచదివిన ఇంటర్మీడియట్ కాలేజీ లాంటిది కాదు అక్కా. రోజక్కా.. ఈ మధ్య ఊ అంటే వెంకటేశ్వరస్వామి వద్దకు వెళ్తున్నావంటా! ఈ మధ్య వెంకటేశ్వరస్వామి దర్శనాన్ని కూడా వ్యాపారంగా మార్చేశావంటగా! ప్రోటోకాల్ దర్శనాల్ని కూడా క్యాష్ చేసుకుంటున్నావు కదక్కా! మంత్రి రోజా ఎన్నిసార్లు ప్రోటోకాల్ దర్శనాల పేరుతో స్వామివారిని దర్శించుకున్నారో టీటీడీఛైర్మన్ సుబ్బారెడ్డి బయట పెట్టాలి. వాస్తవాలు ఆయన బయటపెడితే, రోజా అక్కా.. దర్శనాలపేరుతో ఎంత సంపాదించుకుందో తెలుస్తుంది. సాక్షాత్తూ వెంకటేశ్వరస్వామే భయంతో “రోజాను ఆపండిరా…నాయనలారా” అని మొత్తుకుంటున్నాడని ప్రజలంతా చెబుతున్నారు. నగరి నియోజకవర్గప్రజలంతా వచ్చేఎన్నికల్లో రోజా పని గోవిందా అంటున్నారు. ఏ టీ కొట్లో అడిగినా నీ జాతకం చెబుతున్నారుఅక్కా. నియోజకవర్గంలోని 5మండలాల ఎమ్మార్వోలు నీకునెలానెలా జీతం ఇవ్వాలంట కదక్కా! అదేదో కోసలనగర్లో 35ఎకరా లు, పాతర్ కాడ్ లో 50ఎకరాలు.. ఇలా నీ మంత్రిగిరీ వచ్చాక చాలాపోగేశావంట కదా అక్కా! జబర్దస్త్ లో ఎంతకష్టపడి నవ్వుతున్నావో తెలుసు అక్కా. అంతకష్టపడుతు న్న నీకు ఇన్నిఎకరాలు లేకపోతే ఎలా? చెరకుఫ్యాక్టరీ తెరిపిస్తానని ఇక్కడిప్రజల చెవుల్లో పూలు పెట్టావంట కదక్కా? ఈమధ్య ఊ అంటేచాలు దుబాయ్, కువైట్ వెళ్తు న్నావంటా అక్కా… అక్కడేం వ్యాపారం పెట్టావక్కా! అమీర్ పేటలో దుకాణం ఎత్తేసి కువైట్లో పెట్టావా? కువైట్లోని నవాబులతో కలిసి వ్యాపారం మొదలెట్టావా అక్కా? ఒకసారి నన్ను కూడా తీసుకెళ్లు అక్కా. బొమ్మలు అమ్ముకునేవాళ్ల వద్దనుంచి కూడా జేట్యాక్స్ కు అదనంగా ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నావంట కదక్కా! నువ్వు సినిమాలు వదిలేసినాకూడా ఏం డ్యాన్స్ చేశావక్కా. చెప్పులు మోసే స్థాయి నుంచి, మా అక్కచెప్పులు మోయించే స్థాయికి వెళ్లడానికి ఎంతకష్టపడిందో ప్రజలంతా గ్రహించాలి. అదంతా జగన్మోహన్ రెడ్డి చలవే. గాలేరు-నగరి ప్రాజెక్ట్ వచ్చేసింది.. నీళ్లుపారుతున్నాయని చెప్పి జనాల్ని మోసగిస్తున్నావు కదక్కా. మూడున్నరేళ్లనుంచి నీ నియోజకవర్గంలో తట్టమట్టి కూడావేయని నిన్నుచూసి, నీ నియోజకవర్గ ప్రజలే కాండ్రించి ఊస్తన్నారు అక్కా. మాముఖాల మీద పడుతుందేమోనని తప్పుకొనితప్పుకొని వెళ్లాల్సి వస్తుందక్కా. దుబాయ్ కువైట్ వ్యాపారాలు ఆపేసి, చివరి సంవత్సరంలో అయినా నగరి ప్రజలకు చేస్తానన్నపనులు చేయ్ అక్కా. అక్కా.. ఇంకోసారి పిత్రే గిత్రే అంటే జబర్దస్త్ బ్యాండ్ వాయిస్తాం జాగ్రత్త. ఇంకా చాలాచాలా మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు కాదు, నువ్వు, నీ తోటిచెత్తమంత్రులు లోకేశ్ గురించి మాట్లాడితే చాలాచాలా అనాల్సి వస్తుందని గుర్తుంచుకోండి.”

మాటతప్పి, మడమతిప్పిన జగన్ రెడ్డి మోసాలు గ్రహించారు కాబట్టే.. ప్రజలు తండోపతండాలుగా లోకేశ్ యువగళం యాత్రకు తరలివస్తున్నారు : బీ.కే.పార్థసారథి
“18వ రోజు పాదయాత్రలో బీసీలు, మైనారిటీలతో లోకేశ్ మాట్లాడినప్పుడు వారుచెప్పినవి విన్నాక, ఈప్రభుత్వం వారిప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పలేనిస్థితిలో ఉందని అర్థమైంది. మంత్రివర్గకూర్పులో గానీ, సబ్ ప్లాన్ అమలు, సంక్షేమం అమల్లోగానీ టీడీపీ ప్రభుత్వం బీసీలను అన్నివిధాల ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ప్రోత్సహించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి చంద్రబాబు గతంలో లక్షలకోట్లు వెచ్చించారు. జగన్ రెడ్డి ఏర్పాటుచేసిన 56 బీసీ కార్పొరేషన్లు నిరుపయోగంగా మారాయి. విదేశీవిద్యకు టీడీపీప్రభుత్వం రూ.10లక్షలిస్తే, జగన్ ఆపథకాన్నే రద్దుచేశాడు. పెళ్లికానుక పథకంకింద ఆయా వర్గాలకు చంద్రబాబు రూ.30వేల నుంచి రూ.లక్షవరకు అందించారు. రంజాన్ తోఫా, సంక్రాంతి, క్రిస్మస్ కానుకల పేరుతో హిందూ, ముస్లిం, క్రైస్తవులకు చంద్రబాబు పండుగలవేళ నాణ్యమైన సరుకులు అందించారు. టీడీపీప్రభుత్వం చంద్రన్నబీమా కింద రూ.2లక్షలు అందించింది. ప్రమాదాల్లో చనిపోయినవారికి రూ.5లక్షలు అందించింది. జగన్ కు బీసీలంటే గిట్టదు. అసెంబ్లీలో బలంగా గొంతు వినిపిస్తున్నాడని అచ్చెన్నాయుడుని తప్పుడుకేసులతో జైలుకు పంపాడు. ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపుతున్నాడని కొల్లురవీంద్రను జైలుకు పంపించాడు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలను వేధిస్తూ, వారికుటుంబాలను బలితీసుకుం టున్నాడు. అబ్డుల్ సలాం, అబ్డుల్ సత్తార్ కుటుంబాలు జగన్ రెడ్డి దాష్టీకానికి బలయ్యాయి. డాక్టర్ సుధాకర్ మొదలు డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎందరో దళిత, గిరిజన బిడ్డలు ఈప్రభు త్వ దుర్మార్గంతో అసువులు బాశారు. అహంకారంతో, అధికారంతో చేసే ప్రతిపనికి జగన్ రెడ్డి భవిష్యత్ లో మూల్యం చెల్లించుకుంటాడు. మాటతప్పి, మడమతప్పిన జగన్ రెడ్డి మోసాల ను ప్రజలు గ్రహించారు కాబట్టే, లోకేశ్ యువగళంయాత్రకు తండోపతండాలుగా తరలివస్తు న్నారు. మైకులు లాక్కున్నా.. వాహనాలు అడ్డుకున్నా.. తప్పుడుకేసులు పెట్టినా, లోకేశ్ యాత్ర ఆగదు. చంద్రబాబు జగన్ రెడ్డి పాదయాత్రకు అన్నివిధాల సహకరించి, భారీబందో బస్త్ కల్పించారు. అదేవిధంగా జగన్ రెడ్డి లోకేశ్ యాత్రకు ఎందుకు సహకరించడని ప్రశ్ని స్తున్నాం. జగన్ రెడ్డి ప్రభుత్వానికి నూకలు చెల్లాయి. ఇప్పటికైనా పాలకులు బుద్ధితెచ్చుకొని లోకేశ్ యాత్రకు సహకరిస్తే ప్రజల మన్ననలు పొందుతారు.”

Leave a Reply