Suryaa.co.in

Andhra Pradesh

బీసీలు బానిసలుగా బతుకుదామా?

– తిరగబడి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుదామా?
– బీసీలు గొంతు ఎత్తుతుంటే తాడేపల్లిలో జగన్ కి దడ
భయం మా బీసీల బయోడేటా లోనే లేదు జగన్
వందలాది బీసీలను పొట్టన పెట్టుకున్న రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి
అదే జైల్లో అదే బ్లాక్ లో నిన్ను చిప్పకూడు తినిపించే రోజు అతి దగ్గరలోనే ఉంది జగన్ రెడ్డి
– కోవూరు నియోజకవర్గ ఇన్చార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన “జయహో బీసీ” కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి పై దండయాత్ర చేసిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

బీసీ వ్యతిరేక ప్రభుత్వానికి ఇంకా 60 రోజులే మిగిలిఉన్నాయి. రాబోయే ఎన్నికలలో వాడ వాడల తెదేపా జెండా ఎగరు వేయడానికి బీసీ వర్గాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. బీసీలు అంతా ఏకతాటి పై వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుదామన్నారు. బీసీలు గొంతు ఎత్తుతుంటే తాడేపల్లిలో జగన్ కి దడ.. అందుకే బీసీలను అడుగడుగునా అడ్డుకుంటూ అక్రమ అరెస్టులు చేస్తున్నాడు.

నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన బీసీలకు చైతన్య పరిచే విధంగా జయహో బీసీ కార్యక్రమం చేపడుతున్నాం.జగన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయాలను వివరిస్తూ రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం కల్పించే హక్కులను తెలియజేస్తున్నాం.962 “జయహొ బీసీ” సభలు ప్రతి మండలంలో ఒక సభ నిర్వహించడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం.ఇప్పటికే 870 పైగా సమావేశాలు పూర్తి చేసుకున్నాం.

భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా బీసీలకు మాత్రం అన్న నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాతే స్వాతంత్రం వచ్చింది. బలహీన వర్గాల ప్రజలు బతికే హక్కు లేదా? బీసీలను అక్రమ అరెస్టులు చేస్తే భయపడతావ్ అనుకున్నావేమో జగన్ రెడ్డి. భయం మా బీసీల బయోడేటా లోనే లేదు జగన్. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం.మీకు అండగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు.

బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు,మైనార్టీలనే కాకుండా సొంత సామాజిక వర్గాన్ని కూడా నట్టేట ముంచాడు జగన్ రెడ్డి. 2024లో తెలుగుదేశం – జనసేన ఉమ్మడి ప్రభుత్వం తథ్యం.. వందలాది బీసీలను పొట్టన పెట్టుకున్న రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి.జగన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీల ధనమాన ప్రాణాలకు రక్షణ లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారం దిగిపోవడినికి “సిద్ధం” గా వున్నారు.

వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాకుండా చూసుకోవాలి. అందుకే ముందుగా ప్రజలకి “సిద్దం” సింబాలిగ్గా చెప్తున్నాడు. ప్రజలు గమనించాలి. బీసీల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చే విధంగా నారా చంద్రబాబు రూపకల్పన చేస్తున్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు కులగణన పేరుతో రాజ్యాంగ ఇతర వాలంటీర్లను ఇంటింటికి తిప్పి వేలిముద్రలు వేయించుకుంటున్నారు.

శాంతియుతంగా నిరసన తెలియజేస్తే మా టెంట్లను పీకేసి మమ్మల్ని అక్రమ అరెస్టు చేశారు. ఈ రాష్ట్రం కోసం అనునిత్యం పాటుపడే వ్యక్తిని అక్రమ అరెస్టు చేశారు. ఈ ప్రపంచంలో ఎంతోమందిని అరెస్టు చేశారు, కానీ ప్రపంచంలో ఏ నాయకుడికి రానంత స్పందన నారా చంద్రబాబుకి వచ్చింది. 80 దేశాలకు పైగా రోడ్లపైకి వచ్చి ముక్తకంఠంతో వారు నిరసన తెలియజేయడం ప్రపంచంలో ఏ నాయకుడికి దక్కని గౌరవం.

అరటిపళ్ళు బండి దగ్గర మేక నమిలి నట్టు గుట్కా నములుతున్న కొడాలి నాని చంద్రబాబు కోసం మాట్లాడితే తరిమి తరిమి కొడతాం. ప్రొద్దుటూరు లో చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్య నీ అతి కిరాతకంగా చంపించారు. మాచర్లలో తోట చంద్రయ్యని జై జగన్ అని చెప్పమంటే లేదు జై చంద్రబాబు అని ప్రాణం విడిచాడు. రేపల్లెలో పసి బాలుడు అమర్నాథ్ గౌడ్ ని అతి కిరాతకంగా చంపిన వ్యక్తిని రోడ్డు మీద ఊరేగించారు.

నిన్న కాక మొన్న మాచర్ల నియోజకవర్గంలో శ్రీకాకుళం నుంచి వేట కోసం వచ్చిన మత్స్యకార సోదరుడిని వైసిపి ఎమ్మెల్యే వేధింపులకు గురిచేసి ఆత్మహత్య చేసుకునే విధంగా చేశాడు. వచ్చేది తెలుగుదేశం – జనసేన ఉమ్మడి ప్రభుత్వమే.. చంద్రబాబును ఏ జైల్లో అయితే అక్రమంగా పెట్టించావో అదే జైల్లో అదే బ్లాక్ లో నిన్ను చిప్పకూడు తినిపించే రోజు అతి దగ్గరలోనే ఉంది జగన్ రెడ్డి.

 

LEAVE A RESPONSE