గంజాయి స్మ‌గ్ల‌ర్ల పాపం..ప‌ర‌దేశి కుటుంబానికి శాపం

– ప్ర‌మాద‌భీమా ప‌రిహారంతో ఆదుకున్న తెలుగుదేశం

వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్రం గంజాయి స్మ‌గ్ల‌ర్ల‌కు స్వ‌ర్గ‌మైంది. గంజాయి ముఠాలు చేసిన పాపం, తెలుగుదేశం కార్య‌క‌ర్త‌ ప‌ర‌దేశి కుటుంబానికి శాపంగా ప‌రిణ‌మించింది. పూత‌ల‌ప‌ట్టు నియోజ‌క‌వ‌ర్గం, బంగారుపాళ్యం మండ‌లం, టేకుమంద గ్రామంలో నివ‌సించే ప‌రదేశికి తెలుగుదేశం అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. ప‌ర‌దేశి క‌ర‌డుగ‌ట్టిన టిడిపి కార్య‌క‌ర్త‌. ట్రాక్ట‌ర్ న‌డుపుతూ జీవ‌నం సాగిస్తున్నారు. భార్య క‌న్న‌మ్మ‌, ఇద్ద‌రు కుమార్తెలు, ఒక కుమారుడితో ప్ర‌శాంతంగా జీవించేవారు. 2020 జూన్ 5వ తేదీన గంజాయి త‌ర‌లిస్తున్న స్మ‌గ్ల‌ర్ల వాహ‌నం అతి వేగంగా వ‌చ్చి ప‌ర‌దేశి ట్రాక్ట‌ర్‌ను ఢీకొంది. ఈ ప్ర‌మాదంలో ప‌ర‌దేశి అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు.

టిడిపి స‌భ్య‌త్వం తీసుకున్న‌ ప‌ర‌దేశికి మంజూరైన రూ. 2ల‌క్ష‌ల బీమా ప‌రిహారాన్ని టిడిపి ఆయ‌న కుటుంబానికి అంద‌జేసింది. కుటుంబాన్ని పోషించే య‌జ‌మాని హ‌ఠాత్తుగా చ‌నిపోతే, రోడ్డున‌ప‌డ్డ కుటుంబానికి బీమా సొమ్ము తాత్కాలికంగా ఆధార‌మైంది. పిల్ల‌ల చ‌దువు, పెళ్లి అవ‌స‌రాల‌కు టిడిపి అందించిన సాయం ఉప‌యోగ‌ప‌డింది. త‌న భ‌ర్త మ‌ర‌ణం త‌రువాత కుటుంబ‌స‌భ్యులుగా త‌మ‌ను భావించి ఆదుకున్న టిడిపికి ఎల్ల‌ప్పుడూ రుణ‌ప‌డి ఉంటామ‌ని క‌న్న‌మ్మ చెబుతోంది. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో నారా లోకేష్‌ని క‌లిసి త‌న భ‌ర్త‌కి జ‌రిగిన ప్ర‌మాదం, పార్టీ ఆదుకున్న తీరు వివ‌రించి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది క‌న్న‌మ్మ‌.

Leave a Reply