– బాధిత కుటుంబానికి అండగా ఉంటామని జగన్ భరోసా
– ఇప్పటికే రూ.10 లక్షల సాయం పంపిణీ
తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ను చీలి సింగయ్య భార్య లూర్ధు మేరి, కుమారులు, కుటుంబ సభ్యులు బుధవారం కలిశారు. ఇటీవల జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ళ పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో చీలి సింగయ్య ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి, రూ. 10 లక్షల సాయం అందజేసింది. సింగయ్య కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ తదితరులు ఉన్నారు.