(బాబు)
35 ఏళ్ల యువకుడు జగన్ రెడ్డి, తండ్రి సమక్షంలో.. వంగలేక కూర్చోని కొబ్బరికాయ కొట్టాడు. కడపలో బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ కోసం తండ్రితో కలిసి మొదటి శంకుస్థాపన చేస్తున్న దృశ్యం ఇది.
అప్పటికే సాక్షిలో రెడ్ గోల్డ్ గట్రాల తరపున అక్రమ తండ్రి లెక్కన పెట్టుబడులు పెట్టాడు గాలి జనార్ధన్ రెడ్డి. మామూలుగా రాలేదు కోపం వైఎస్ రాజశేఖరరెడ్డి గారికి. తాను క్విడ్ ప్రో క్రింద సరిహద్దుల పరిధి దాటి, అప్పటికే ఇనుప గనులను కొల్లగొడుతున్న గాలి కోసం అప్పటి గనుల శాఖ డైరెక్టర్ రాజగోపాల్ ను పురమాయించి చేస్తున్న సహకారం గురించి.
కట్టలు తెంచుకుని వచ్చింది కోపం.
పదివేల ఎకరాలకు పైగా కట్టబెట్టాడు భూముల్ని వైఎస్ రాజశేఖరరెడ్డి పప్పు బెల్లాల రేటుకి. ఆ సందర్భంగా పూనకాలు పోతూ మరో పది వేల ఎకరాలు గాలి ఎయిర్పోర్టుకు కట్టబెట్టాడు వైఎస్ రాజశేఖరరెడ్డి.
నిలదీయడానికి వెళ్లిన అప్పటి టిడిపి ప్రతిపక్ష నాయకులు మీద దాడి చేయించి, వారి మీదే అక్రమ కేసులు పెడితే.. ఇటీవలే ఆ కేసులు కొట్టేశారు. ఆ సందర్భంగా అప్పటి టిడిపి నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి, ఇటీవల చంద్రబాబును కలవడం మనకు తెలిసిందే.
అవన్నీ ప్రక్కనబెడితే.. గాలి జనార్ధన్ రెడ్డి ఆ భూములు బ్యాంకులో తాకట్టు పెట్టి లోను తీసుకొని కనీసం వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు కాంపౌండ్ వాల్ కూడా కట్టలేదు.
కానీ చీటీలు వేసి మోసం చేసి బళ్లారి పారిపోయిన గాలి జనార్ధన్ రెడ్డి, ఓబుళాపురం మైన్స్ పేరును విధ్వంసం మొదలెట్టాడు. చైనాకు వయా అనంతపురం నెల్లూరు కృష్ణపట్నం ద్వారా పన్నులు ఎగవేసి ఎగుమతులు చేసాడు. అడ్డం వస్తాడని పరిటాల రవీంద్రను మర్డర్ చేయించారు. ఆడింది ఆట పాడింది పాట. ఎదురులేదు.
మరోవైపు అంతకు ముందు గాలి తన బళ్ళారిలో టిఫిన్ తినడానికి సొంత హెలికాప్టర్, కుర్చీలో కూర్చోడానికి బంగారు కుర్చీ.. క్రిష్ణ దేవరాయలు లెక్కన భావిస్తూ.. కర్ణాటకలో రాజకీయాలు శాసించే స్థాయికి ఎదిగాడు. పరాకాష్టగా వేంకటేశ్వర స్వామివారికి ఆ దోపిడీ డబ్బులతో కిరీటం చేసి బహుకరించాడు గాలి.
కర్ణాటకలో రెడ్డి బ్రదర్స్ అంటే ఒక బ్రాండ్. ఎదురు వస్తే ఇనుప ఖనిజం లారీల క్రింద ఏక్సిడెంట్లో పోవాల్సిందే. అనంతపురం వయా నెల్లూరు పోర్టు వరకు గాలికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గ్రీన్ ఛానల్.
విచ్చలవిడి దోపిడీ. ఆఖరికి సుంకాలమ్మ గుడిని కూడా పేల్చేశాడు గాలి. తపాలా గణేష్ అనే ఆయన పోరాటం చేశారు కర్ణాటక నుండి. వైఎస్ రాజశేఖరరెడ్డి పోయాడు. కేసులు నమోదు అయ్యాయి. దర్యాప్తు మొదలైంది.
సీబీఐ విచారణలో ఏకంగా హైకోర్టు జడ్జీకి లంచం ఇచ్చాడు గాలి జనార్ధన్ రెడ్డి. ఆయన నివాసంలో సోదాలు జరిగాయి. ఏకంగా జడ్జీ ఆత్మహత్య చేసుకున్నాడు. పరమ బూతులు తిట్టాడు పోరాటం చేయిస్తున్న చంద్రబాబు గారిని గాలి జనార్ధన్ రెడ్డి. జైలు జీవితం గడిపాడు. బళ్ళారిలో అడుగుపెట్టలేని ఆంక్షలు. రెడ్డి బ్రదర్స్ కు బుద్ధి చెప్పారు జనం.
కట్ చేస్తే ఓపెన్ విత్ ఆర్కేలో గాలి.. తాను చంద్రబాబు విషయంలో తప్పుగా మాట్లాడను అని ఒప్పుకోలు. దేవుడు ఇచ్చిన అన్నయ్య గాలి అని అన్న జగన్ నోటితో… ఎవరు గాలి జనార్ధన్ రెడ్డి? నాకు ఆయనతో సంబంధం లేదన్నాడు. దులిపేసుకొన్నా.. గాలి జనార్ధన్ రెడ్డి జగనుకు సాయం చేశాడు.
ఈ శంకుస్థాపనలో చిన్న పిల్లగా ఉన్న అమ్మాయికి పెళ్లి చేశాడు గాలి. నోట్ల రద్దు సమయంలో కూడా ప్యాలెస్ గ్రౌండ్లో జరిగిన ఆ వైభవ పెళ్లి చూసి అందరూ అవాక్కయ్యారు. డోంట్ కేర్ అన్నట్లుగా గాలి వ్యవహరించాడు.
ఇన్నాళ్లకు పాపం పండి జడ్జి జైలు శిక్ష ఖరారు చేస్తుంటే కంగారుగా.. నేను అనుభవించిన జైలు శిక్ష పరిగణనలోకి తీసుకోండి అని వేడుకున్నాడు గాలి. నీకు 10 ఏళ్లు కాదు యావజ్జీవ కారాగార శిక్ష వేసినా తప్పులేదు అని అన్నారట.
నాటి ఈడీ రాజగోపాల్ నుండి అందరికీ శిక్ష పడింది. సబితా ఇంద్రారెడ్డి, ఒక అయ్యేఎస్ నిర్దోషులుగా బయటపడ్డారు. శ్రీలక్ష్మి డిశ్చార్జ్ అయ్యింది. పాపం ఇన్నాళ్లకు పండింది. జగన్ అయినా వారి జేజి నాయన అయినా అనుభవిస్తారు పాప కర్మ. కాస్త అటూ ఇటూ ఇంతే. ప్రకృతి చెరబట్టిన పాపాత్ములు. గతంలో జగనుకు సహకరించి ఇంకా సహకారాన్ని అందిస్తున్న అధికారులు సైతం ఇలాగే అనుభవిస్తారు. కర్మ వదలదు.