Suryaa.co.in

Andhra Pradesh

సర్‌ ఆర్థర్‌ కాటన్‌ చిరస్మరణీయుడు

-బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
-దవళేశ్వరం బ్యారేజ్‌ దగ్గర నివాళి

అఖండ గోదావరికి బ్యారేజ్‌ నిర్మించిన మహనీయుడు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కొనియాడారు. గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా సర్‌ ఆర్థర్‌ కాటన్‌ విగ్రహాలు కానవస్తామన్నారు. బుధవారం దవళేశ్వరం బ్యారేజీ దగ్గర సర్‌ అర్థర్‌ కాటన్‌ నిలువెత్తు విగ్రహానికి పూలమాల వేసి కాటన్‌ స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కాటన్‌ నడయాడిన గోదావరి ప్రాంతంలో జరిగిన సంఘటనను ప్రస్తావించారు. గోదావరి బ్యారేజ్‌ నిర్మాణం అనంతరం ఒక సత్‌ బ్రాహ్మణుడు సంధ్యావందనం చేస్తున్న సమయంలో కాటన్‌ దొర బ్రాహ్మణుడిని పలకరించారు. గోదావరికి బ్యారేజ్‌ నిర్మించిన కారణంగానే మేం నిత్యం పూజావందనాలు గోదావరి తీరంలో చేసుకునేందుకు వీలుగా ఉందని బ్రాహ్మణుడు సమాధానం చెప్పారని గుర్తు చేశారు. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నిజమైన ప్రాతఃస్మరణీయుడని కీర్తించారు. అటువంటి మహనీయుడి జయంతి వేడుకలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE