Suryaa.co.in

Andhra Pradesh

టెన్త్ పరీక్షా కేంద్రంలో అధికారిని కాటు వేసిన పాము

చిలకలూరిపేట: టెన్త్ పరీక్షా కేంద్రంలో పాము కాటేసిన ఘటన చిలకలూరిపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని వేద స్కూల్లో 10th పరీక్షలకు చీఫ్ సూపరింటిండెంట్ గా విజిట్ కు వెళ్లిన కరీముల్లాను పాము కాటు వేసింది. వెంటనే ఉపాధ్యా యులు, స్థానికులు కరీముల్లాను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం కరీముల్లా ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

LEAVE A RESPONSE