ఏం జగన్ మోహన్ రెడ్డీ..ఇప్పటికైనా మారవా?

-ప్రశ్నించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

పెట్రోలుపై 31 శాతం వ్యాట్ + రూ.4+రూ.1, డీజిల్ పై 22.5 శాతం వ్యాట్ +రూ.4, +రూ.1 పన్నులు వేసి 151 సీట్లు ఇచ్చిన ప్రజలను బాదేస్తావా…ఓ వైపు కేంద్రం మరోవైపు పొరుగు రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంటే మీరు మాత్రం స్పందించరా…వ్యాట్ లో కనీసం 5 శాతంతో పాటు అదనంగా మీరు వేస్తున్న రూ.5 పన్ను తగ్గించినా లీటర్ కు రూ.10 భారం తగ్గుతుంది.

కేంద్ర ప్రభుత్వం ఓ వైపు పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ మరోవైపు లక్షా 10 వేల కోట్లు ఎరువులపై రాయితీ ప్రకటించింది.దేశవ్యాప్తంగా ఇంత జరుగుతున్నా ఏపీ ప్రజలపై మాత్రం మీరు కనికరం చూపరా.కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిందిపోయి కుమ్ముడే కుమ్ముడు అంటూ మరింత కుమ్మేస్తారా..

Leave a Reply