టీడీపీ తిరిగి అధికారంలోకి రావడానికి ప్రవాసుల సహకారం అవసరం

– మాజీ మంత్రి బుచ్చయ్య చౌదరి
– బోస్టన్‌లో వైభవంగా మహానాడు ప్రారంభం

అమెరికాలోని బోస్టన్ నగరంలో రెండు రోజుల పాటు జరిగే తెలుగుదేశం మహానాడు కార్యక్రమం ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, శాసనసభ పక్ష ఉపనేత, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావటం కోసం ప్రవాస తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్రంగా కృషి చేయాలన్నారు. ప్రవాసుల సహకారం ఎంతో అవసరం అని పేర్కొన్నారు. ఎన్నారైల సహకారంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తపరిచారు.

ఎన్నికల సమయంలో ప్రవాసాంధ్రులు తమ ప్రాంతాలకు వచ్చి తెలుగుదేశం తిరిగి అధికారంలోకి రావడం కోసం కృషి చేయాలని బుచ్చయ్యచౌదరి పిలుపు
usa1 ఇచ్చారు. పార్టీ సీనియర్ నేతలు ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.ఎన్. ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు శ్రీ కందుల నారాయణరెడ్డి, వై.వి.ప్రభాకర చౌదరి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, నన్నారి నర్సిరెడ్డి, మన్నవ సుబ్బారావు తదితరులు ప్రసంగించారు.

ఎన్నారై టీడీపీ కన్వీనర్ కోమటి జయరాం స్వాగతం పలికారు. అమెరికా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో టీడీపీ అభిమానులు కార్యకర్తలు ఈ మహానాడుకు తరలి వచ్చారు.

Leave a Reply