Suryaa.co.in

Andhra Pradesh

దుర్గమ్మ ఉత్సవాల్లో అన్యమత ప్రచారంపై సోము వీర్రాజు ఆగ్రహం

విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం చేస్తున్న హిందూధర్మ ప్రచార కార్యక్రమాల్లో క్రైస్తవ మత ప్రచారాన్ని ఎలా నిర్వహిస్తారని ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు.
ఈ ప్రభుత్వానికి అసలు హిందూ ధర్మం మీద ఏమాత్రం గౌరవం లేదని, హిందూ ధర్మ వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రతి నిత్యం ఎన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నా,పాలకుల అలసత్వం – అధికారుల నిర్లక్ష్యంతో అన్యమత ప్రచారానికి ప్రోత్సహిస్తున్నట్లుగా కనపడుతోందని సోము వీర్రాజు తీవ్రంగా విమర్శించారు.
దేవాదాయ శాఖ మంత్రి, దేవాదాయ శాఖ కమిషనర్ స్వీయ పర్యవేక్షణలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రకటించుకున్న ప్రభుత్వం, ఈ ఘటనపై ఎందుకు సమాధానం చెప్పడంలేదని ప్రశ్నిస్తూ….ఇప్పటికే పదుల సంఖ్యలో మత ప్రచార బోధకులు ఇంద్రకీలాద్రి చుట్టూ ‘అన్యమత ప్రచారం సాగిస్తూ,మతమర్పిడులు ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం చోద్యం చూస్తోందని, ఈ సంఘటనలపై వెంటనే అధికార యంత్రాంగం స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE