పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి

– పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష
-పురపాలకశాఖలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సీఎంకు వివరించిన – అధికారులు

ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే… :
– టిడ్కో ఇళ్ల నిర్మాణం, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి సమీక్ష.
– త్వరగా ఇళ్లను పూర్తిచేయాలని సీఎం ఆదేశం.
– నిర్దేశించుకున్న సమయంలోగా పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలి: సీఎం
– ఆలోగా రిజిస్ట్రేషన్లు కూడా పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలి
– టిడ్కో ఇళ్లలో మౌలిక సదుపాయాల కల్పనా పనులు వేగంగా జరుగుతున్నాయన్న అధికారులు.
– ఈ ప్రభుత్వం వచ్చాక మూడేళ్లలో రూ.4500 కోట్లు ఖర్చుచేశామన్న అధికారులు.
– ఇంకా కనీసంగామరో రూ.6వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్న అధికారులు.
–నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల్లో రోడ్ల అభివృద్ధిపై సీఎం సమీక్ష.
– 16,762 రోడ్లకు సంబంధించి 4396.65 కి.మీ మేర రోడ్లు నిర్మాణం కోసం… రూ.1826.22 కోట్లు ఖర్చుచేస్తున్న ప్రభుత్వం. ఇప్పటికే 55.15శాతం పనులు పూర్తి.
– వీటితోపాటు రోడ్లపై గుంతలు పూడ్చే పనులు కూడా ముమ్మరంగా చేస్తున్నామన్న అధికారులు.
జులై 15 నాటి కల్లా రోడ్లపై గుంతలు లేకుండా పనులు పూర్తిచేస్తామన్న అధికారులు.
ఇప్పటికే 51.92శాతం పనులు పూర్తి.

మురుగునీటి జలాల శుద్ధిపై ప్రత్యేక దృష్టి అధికారులకు సీఎం ఆదేశం.
మురుగునీటి శుద్ధిపై రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలను వివరించిన అధికారులు.
కృష్ణా గోదావరి నదులు, వాటి పంటకాల్వలు మురుగునీటి వల్ల కలుషితం అవుతున్నాయి
శుద్ధిచేసిన తర్వాతనే అవి కాల్వల్లోకి, నదుల్లోకి చేరాలి
ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టిపెట్టండి
ఇప్పటివరకూ చేపట్టిన పనులు, ఎక్కడెక్కడ మురునీటి శుద్ధి సదుపాయాలు ఉన్నాయి? ఎక్కడెక్కడ చేపట్టాలి? తదితర అంశాలపై పూర్తిస్థాయి కార్యాచరణతో నివేదిక సమర్పించాలన్న సీఎం.
పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి : సీఎం
రాష్ట్రంలో ప్రధాన నగరాలతో పాటు అన్ని మున్సిపాల్టీల్లోనూ పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యమివ్వాలన్న సీఎం

సమగ్రమైన పారిశుద్ధ్య నిర్వహణ ద్వారా ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యతనివ్వగలుతామన్న సీఎం
ఇందులో సిబ్బంది పాత్ర అత్యంత కీలకమన్న సీఎం
_ ఆ ఉద్దేశంతోనే మనం జీతాలు పెంచాం:
– ఈ ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలలకే మున్సిపల్‌ పారిశుద్ధ్య సిబ్బంది జీతాన్ని 50శాతం పెంచింది. రూ.12 వేల నుంచి రూ.18వేలకు పెంచింది:
– చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో వారిని ఎవ్వరూ పట్టించుకోలేదు:
– వారు చేస్తున్న పనులను చూసి, చలించి వారికి రూ.18వేల జీతాన్ని అధికారంలోకి రాగానే ఇచ్చాం:
– ప్రజారోగ్యం కోసం వారు పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు, ఈ పనులను ఎవ్వరూ కూడా చేయలేరు:
– 2015 నుంచి 2018 సెప్టెంబరు వరకూ మున్సిపల్‌ పారిశుద్ధ్య సిబ్బంది జీతం కేవలం రూ.10వేలు మాత్రమే:
– 2019 ఎన్నికలకు కేవలం 4 నెలల ముందు వారి జీతం రూ.10 వేల నుంచి రూ.12వేలు చేశారు:
– అంటే ఐదేళ్లపాటు చంద్రబాబు నెలకు ఇచ్చింది కేవలం రూ.10వేలు మాత్రమే.
దాన్ని మనం వచ్చిన తర్వాత రూ.18వేలు చేశామన్న సీఎం
విజయవాడలో కాల్వల సుందరీకరణపైనా నివేదిక ఇవ్వాలన్న సీఎం.
పంటకాల్వల్లో చెత్త , ప్లాస్టిక్‌ వ్యర్థాలు వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్న సీఎం.
మ్యాపింగ్‌చేసి కొన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టి, అక్కడ పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్న సీఎం.

జగనన్న హరిత నగరాలు కార్యక్రమంపై సీఎం సమీక్ష:
– ఎయిర్‌ పోర్టులనుంచి నగరాలకు వెళ్లే రోడ్లను అందంగా తీర్చిదిద్దండి: సీఎం
– గన్నవరం నుంచి విజయవాడ, భోగాపురం నుంచి విశాఖపట్నంకు వెళ్లే రహదారులు అందంగా తీర్చిదిద్దాలి:
– ఈ పనులు నగరం అందాలను మెరుగుపరిచేలా ఉండాలి:
– రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎంపిక చేసిన రోడ్లను ఇదే రకంగా అభివృద్ధిచేసి అందంగా తీర్చిదిద్దాలి:

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌పై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష
ప్రతి నియోజకవర్గంలో కూడా స్మార్ట్‌టౌన్‌షిప్స్‌ ప్రారంభం కావాలన్న సీఎం
నగరాలు, పట్టణాల్లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్లను, ఆర్వోబీలను సత్వరమే పూర్తిచేయాలన్న సీఎం.
అనుమతులు మంజూరైన చోట వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
–సీఆర్డీఏ కింద పనుల ప్రగతిని సమీక్షించిన సీఎం
– కరకట్ట రోడ్డు నిర్మాణం కొనసాగుతోందన్న అధికారులు.
– క్వార్టర్ల నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయన్న అధికారులు.
– సీడ్‌యాక్సిస్‌ రోడ్లలో నాలుగు గ్యాప్స్‌ను పూర్తిచేసే పనులు మొదలవుతాయన్న అధికారులు.
– జులైలో కొత్తగా మహిళా మార్టులను ఏర్పాటు చేస్తున్నామన్న అధికారులు.
– ఇప్పటికే 6 చోట్ల నడుపుతున్నామన్న అధికారులు
– పైలెట్‌ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన మార్టులు ఎలా నడుస్తున్నాయో సమీక్ష చేయాలన్న సీఎం.
– అవి సమర్ధవంతంగా నడిచేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
ఈ సమీక్షా సమావేశంలో పురపాలక,పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ సమీర్‌ శర్మ, పురపాలక, పట్ణణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్, ఏపీసీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ సంపత్‌ కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply