Suryaa.co.in

National

పాక్‌కు ఆర్థిక సహకారం నిలిపేయండి

– ఏడీబీని కోరిన భారత్

పాకిస్థాన్‌కు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆసియా అభివృద్ధి బ్యాంకుని భారత్ కోరింది. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ఏడీబీ అధిపతి మసటో కండాతో నేరుగా ప్రస్తావించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇస్లామాబాద్‌కు వివిధ బహుళపాక్షిక సంస్థల నుంచి అందుతున్న నిధుల ప్రవాహంపై సమీక్ష జరపాలని భారత్ అంతర్జాతీయ సమాజాన్ని కోరుతోంది.

పాకిస్థాన్‌కు ఆర్థిక సహకారం కొనసాగించవద్దని ఆమె స్పష్టంగా విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నాయి. ఈ అంశంపై నిర్మలా సీతారామన్ ఇదివరకే ఇటలీ ఆర్థిక మంత్రితో చర్చలు జరిపారని, పలు ఇతర యూరోపియన్ దేశాలతో కూడా సంప్రదింపులు కొనసాగిస్తున్నారని ఆ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ గ్రే లిస్ట్‌లో పాకిస్తాన్‌ను చేర్చేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.

LEAVE A RESPONSE