నా రాజకీయ జీవితానికి పునఃభిక్ష పెట్టింది జగన్‌: తమ్మినేని సీతారాం

అమరావతి: నాకు రాజకీయ భిక్ష పెట్టానంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తప్పని సభాపతి తమ్మినేని సీతారాం వివరణ ఇచ్చారు. ‘తెలుగుదేశంలోకి రాక ముందే నేను కాంగ్రెస్‌లో ఉన్నా. నాకు టికెట్‌ ఇచ్చి ఆశీర్వదించి, రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు. చంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టిందీ ఆయనే. తర్వాత నేను రాజకీయ పరమైన విభేదాలతో బయటకు వచ్చాక జగన్‌మోహన్‌రెడ్డి ములాఖత్‌కు రమ్మని కబురు పెట్టారు. పిలిచి మాట్లాడాక ఏం చేయమంటారని అడిగితే విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరమనడంతో అలాగే చేశాను. నా రాజకీయ జీవితానికి పునఃభిక్ష పెట్టింది జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీయే’ అని వివరించారు.

Leave a Reply