Suryaa.co.in

Andhra Pradesh

ఆర్టీసీ ఎండీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు లేఖ

ఓటర్లకు అదనపు బస్సుల ఏర్పాటుకు వినతి

పోలింగ్‌కు వచ్చే వారికి అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు శనివారం లేఖ రాశారు. ఆర్టీసీ బస్సులు పెంచడం ద్వారా ప్రయాణ సౌకర్యం కల్పించి ఓటింగ్‌ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఏపీ ఓటర్లు ఓటు వేసేందుకు సొంత ప్రాం తాలకు వస్తారని, వారు వస్తున్నందున రద్దీ నెలకొందన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌, విజయవాడ బస్టాండ్‌లలో ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. అవసరమైన బస్సులు అందుబాటులో లేక సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు బస్‌ స్టేషన్లలో నిరీక్షిస్తున్నారు. ఈ రెండు మూడు రోజులు అదనపు బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణ సౌకర్యానికి ఇబ్బంది లేకుండా చేయాలని విజ్ఞప్తి చేశారు. రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం వల్ల ఓటింగ్‌ శాతం పెరగడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

LEAVE A RESPONSE