సైకోరెడ్డి ఫ్యాన్స్‌ దేశంలో ఎక్క‌డ దాక్కున్నా తెలుగుదేశం వ‌ద‌ల‌దు

-దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్
-డ్ర‌గ్స్ ముఠాల‌ని ప‌ట్టుకోలేని డిజిపి గారు ప్రతిపక్షంపై దొంగ కేసులు పెట్టడంలో బిజీగా వున్నారు
-పట్టాభిపై దాడి చేసి ఉల్టా ఆయనపై కేసు..టిడిపి ఆఫీసుపై దాడిచేసి మాపైనే కేసులు
– టిడిపి ఆఫీసుపైకి వైసీపీ వాళ్లని పంపి..టిడిపి వాళ్లని అడ్డుకున్న పోలీసులు
-టీడీపీ కార్యాలయంపై దాడి చేసి 24 గంటలు గడిచినా ఎందుకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు?
– సైకో రెడ్డి నువ్వు చంద్రబాబుని రాళ్ల‌తో కొట్టి చంపాల‌ని కూసిన‌ కూతలు మరిచిపోయావా?
-చంద్ర‌బాబుకి ఒక చెంపపై కొడితే మ‌రో చెంప చూపుతారు..నేను మీ రెండు చెంప‌లు ప‌గ‌ల‌గొడ‌తాను
-డ్రగ్స్ మాఫియాతో దేశానికే ముప్పు..జాతి అంతా కలిసి పోరాడాలి
మీడియా స‌మావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైకాపా దాడి తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైకో అని మరోసారి రుజువైంది. ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కల్ని దాడికి పంపి తాడేపల్లి కొంపలో దాక్కున్నారు. నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే ప్రత్యక్షంగా రావాలి. సైకో దమ్ముంటే నువ్వేరా తేల్చుకుందాం. ఎవరూ లేని సమయంలో పెంపుడు కుక్కల్ని పంపి దాడి చేయిస్తే మేం భయపడతామని భ్రమ పడుతున్నారు. ప్రతిపక్షంగా ప్రజలు మాకో బాధ్యత అప్పగించారు. ప్రజల తరపున మేం ప్రజా సమస్యలపై నిలదీస్తున్నాం. మేం అడిగే ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలి, లేదా మూసుకుని ఇంట్లో పడుకోవాలి.
ఇవాళ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మాఫియా పెద్దఎత్తున చెలరేగిపోతోంది. దేశంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా మూలాలు ఏపీలో ఉంటున్నాయి. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్రగ్స్ ను లీగలైజ్డ్ ట్రేడ్ కింద మార్చారు. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ గారు కూడా ఏపీ నుంచి పెద్దఎత్తున గంజాయి తెలంగాణకు అక్రమంగా వస్తోందని, అక్కడ పెద్ద ఎత్తున పండిస్తున్నారని చెప్పడం జరిగింది. తెలంగాణ పోలీసులు ఏపీకి వచ్చి స్టింగ్ ఆపరేషన్ చేసి, కాల్పులు కూడా జరిపారు. తెలంగాణ పోలీసులకు ఉన్న చిత్తశుద్ధి ఏపీ పోలీసులకు లేదు. ప్రభుత్వం చేతగానితనం వల్లే ఏపీలో గంజాయి స్మగ్లింగ్ పెరిగిపోయింది.
పోర్టులో హెరాయిన్ పట్టుబడితే కేరాఫ్ అడ్రస్ విజయవాడ ఉంది. వైకాపా ఎమ్మెల్యేల ప్రోద్బలంతోనే గంజాయి హైదరాబాద్ తరలిపోతోంది. కేసీఆర్ కూడా గంజాయి అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ మాత్రం జగన్ కు చీమకుట్టినట్లుగా కూడా లేదు. జగన్ సైకో శాడిస్ట్.మా నాయకులు గట్టిగా నిలదీస్తే.. పిరికోడిలా ఎవరూ లేని సమయంలో మీరు మీ కుక్కల్ని పంపించారు. తర్వాత పారిపోయారు. దాడితో టీడీపీ భయపడుతుంది అనుకుంటే పొరపాటు. రాబోయే రోజుల్లో మీ వీపులు పగులుతాయని హెచ్చరిస్తున్నా. నీ కోడికత్తి వేషాలు నా దగ్గర చూపించకు. నేను మా నాన్నలా సాఫ్ట్ కాదు. మా నాన్న గారు ఒక చెంప పై కొడితే ఇంకో చెంప చూపిస్తారు. నన్ను కొట్టిన వాడి రెండు చెంపలు వాచిపోయేలా కొట్టే రకం నేను. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి.. అధికారం ఉందని రెచ్చిపోతున్నారు. కొట్టిన ప్రతి దెబ్బకి బదులు ఇస్తాం. ఒకటికి పది.
దాడి చేసున్న వాళ్ళు ఎవరో తెలుసు. దాడి వెనుక ఉన్న సూత్రదారులు ఎవరో తెలుసు. బీ కేర్ ఫుల్. అధికారం మారితే సరెండర్ అవుతాం అనుకుంటున్నారో ఏమో. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చేసిన ప్రతి పాపానికి శిక్ష అనుభవిస్తారు. శిక్ష కూడా మీరు ఊహించని రేంజ్ లో ఉంటుంది. దాడి జరిగే ముందు మా నాయకులు పోలీసులకు ఫోన్ చేసినా సరిగా స్పందించలేదు. డీజీపీ ఆఫీసు ముందు నుంచే వైకాపా మూక వచ్చింది. దాడి తర్వాత కూడా డీజీ ఆఫీసు ముందు నుంచే వెళ్లారు. తర్వాత వైకాపా కార్యాలయానికి వెళ్లారు. ఇవన్నీ డీజీపీకి కనిపించలేదా? వైకాపాకు పోరాడాలని ఉంటే టైం, ప్లేస్ చెబితే మేమే వస్తాం. చంద్రబాబు గారికి చాలా సహనం. ఏనాడూ మేం పరుషంగా మాట్లాడలేదు. టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. రాత్రి 8.30 గంటలకు నేను మా పార్టీ కార్యాలయానికి వచ్చాను. ఇక్కడ డీజీపీ పీఆర్వో వైకాపా మూకతో కలిసి దాడికి పాల్పడ్డాడని చెప్పారు. ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కాదా?
దేశ చరిత్రలో ఎక్కడా పార్టీ ప్రధాన కార్యాలయాలపై దాడి జరగలేదు. టీడీపీ కార్యాలయానికి టీడీపీ కార్యకర్తలు రాకూడదు కానీ.. వైకాపా కార్యకర్తలు రావొచ్చా? అడుగడుగునా పోలీసు పహారా పెట్టారు. గాయపడిన మా సిబ్బంది అంబులెన్స్ లో కార్యాలయానికి వస్తుంటే అడ్డుకున్నారు. ప్రశ్నిస్తే నాపైనా ఇష్టానుసారంగా మాట్లాడారు. సజ్జలకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు. వైకాపా నేతలు మాట్లాడిన భాష, జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీకు గుర్తులేవా? చంద్రబాబు కాలర్ పట్టుకోవాలి, నడివీధిలో కాల్చిచంపాలని మీరు చెప్పారా లేదా? బంగాళాఖాతంలో కలపాలని, ముఖ్యకంత్రీ అని, దున్న అని, జైల్లో పెట్టి తన్నాలని మీరు అన్నారా లేదా? అని సైకో రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నా. జగన్ రెడ్డిని అంటే ఆయన అభిమానులకు బీపీ వచ్చిందని చెబుతున్నారు. చంద్రబాబు గారిని అంటే ఆంధ్ర రాష్ట్రానికే బీపీ వస్తుంది. మా పార్ట కార్యకర్తలను వదిలితే మీ వీపులు పగులుతాయని హెచ్చరిస్తున్నా.
భాష గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు ఉందా? బూతులకు కేరాఫ్ అడ్రస్ వైకాపా యూనివర్సిటీ. భాష గురించి లెక్చర్లు ఇవ్వొద్దు. ముఖ్యమంత్రిగా చేసి ప్రతిపక్ష నేతగా ఉన్న మా నాన్న గారిని ఎన్ని మాటలు అన్నారో గుర్తులేదా? అధికారులపై, చంద్రబాబు గారిపై వైకాపా నేతలు ఏవిధంగా మాట్లాడారు? వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు గారి ఇంటిపై దాడి జరిగితే తేలికైన కేసులు పెట్టారు. ప్రశ్నించిన వారిపై మాత్రం వేధింపులకు పాల్పడుతున్నారు. పీపీఈ కిట్లు లేవని ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ ను చిత్రహింసలు పెట్టి చనిపోయేలా చేశారు.
దళితులపై దాడులకు పాల్పడ్డారు. వైకాపా కుక్కలు టీడీపీ కార్యాలయంపై దాడి చేసి, సిబ్బంది తలలు పగలకొడితే ఎఫ్ఐఆర్ లో 307 పెట్టలేదు. డీజీపీ పీఆర్వోను మేం కాపాడి అప్పగిస్తే.. మాపై అటెమ్ట్ మర్డర్ కేసు పెట్టారు. దాడి చేసిన వారిపై కేసులు ఉండవు, సీఐకి కాపలా ఉన్న వారిపై మాత్రం కఠిన సెక్షన్లు పెడతారు. వడ్డీతో సహా నేను చెల్లిస్తా. దేశంలో ఎక్కడున్నా వదిలిపెట్టం. మా దేవాలయంపై దాడి చేశారు. మా ఓర్పు, సహనాన్ని పరీక్షిస్తున్నారు. కొంతమంది పోలీసులు మఫ్టీలో వచ్చి కార్యాలయంలో దాడికి పాల్పడ్డారు.
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మీ వల్ల ఏపీ పోలీసులకు చెడ్డపేరు వస్తోంది. డ్రగ్స్ పై పోరాడితే జగన్ రెడ్డికి ఉలుకూ పలుకూ లేదు. డీజీపీ వాస్తవాలు తెలుసుకోవాలి. టీడీపీ కార్యాలయంపై దాడి చేసి 24 గంటలు గడిచినా ఎందుకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇది మీ చేతగానితనం కాదా? పోస్టింగ్ ల కోసం గౌతమ్ సవాంగ్ చంద్రబాబు గారికి పదేపదే ఫోన్ చేయలేదా గతంలో? ఇప్పుడు కేంద్ర హోం మంత్రి, గవర్నర్ స్పందించినా డీజీపీ స్పందించలేదు. ఇప్పుడన్నా డీజీపీ చట్టాలు అమలు చేయాలి.
పోలీసులకు ఒక్కటే చెబుతున్నా దిగజారి వ్యవహరించకండి. అధికారం శాశ్వతం కాదు. మీరు చేస్తున్న తప్పులు అన్ని మీతోనే సరిచేయిస్తా. తెలుగుదేశం సహనాన్ని చేత‌కానిత‌నం అనుకుంటున్నావా జగన్


రెడ్డి? నీ ప‌త‌నానికి ఒక్కో ఇటుకా నువ్వే పేర్చుకుంటున్నావు. నిన్ను ఉరికించి కొట్టడానికి మాకు ఒక్క నిమిషం చాలు. కేడ‌ర్‌కి మా లీడ‌ర్ క‌నుసైగ చేస్తే చాలు. నీ కార్యాల‌యాల విధ్వంసం నిమిషం ప‌ని. నీ ఫ్యాన్ రెక్కలు మ‌డిచి విరిచి నీ పెయిడ్ ఆర్టిస్టుల్ని రాష్ట్రం దాటేంత‌వ‌ర‌కూ త‌రిమి కొడ‌తారు మా కార్యక‌ర్త‌లు. 2024లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. తగిన మూల్యం చెల్లించుకుంటారు.
ప్ర‌జ‌ల్ని ర‌క్షించే పోలీసులైతే ప‌ట్టాభిపై దాడిచేసిన వారిని అరెస్ట్ చేయాలి కానీ, దాడికి గురైన ప‌ట్టాభినే అరెస్ట్ చేశారంటే.. వీళ్లు ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే పోలీసులు కాద‌ని తేలిపోయింది.
ఏపీలో ప్ర‌జ‌ల‌కీ, ప్ర‌తిప‌క్ష‌నేత‌ల‌కీ ర‌క్ష‌ణ లేదు. ప‌ట్టాభికి హానిత‌ల‌పెట్టాల‌ని పోలీసులు చూస్తున్నారు. ప‌ట్టాభికి ఏమైనా జ‌రిగితే డిజిపి, ముఖ్య‌మంత్రిదే బాధ్య‌త‌. త‌క్ష‌ణ‌మే ప‌ట్టాభిని కోర్టు ముందు హాజ‌రుప‌ర‌చాలి. బోస్‌డీకే అనేది రాజ‌ద్రోహం అయితే.. వైసీపీనేత‌ల అస‌భ్య‌ భాష ఏ ద్రోహం కింద‌కి వ‌స్తుందో డిజిపి చెప్పాలి. డ్ర‌గ్స్ గుట్టుర‌ట్టు చేస్తున్నార‌నే ప‌ట్టాభిని అదుపులోకి తీసుకున్నార‌ని ప్ర‌జ‌ల‌కీ అర్థ‌మైంది. ఎన్నిదాడులుచేసినా, ఎంత‌మందిని అరెస్ట్ చేసినా..దేశానికే ముప్పుగా ప‌రిణ‌మించిన వైసీపీ డ్ర‌గ్స్ మాఫియా ఆట క‌ట్టించేవ‌ర‌కూ టిడిపి పోరాటం ఆగ‌దు.

Leave a Reply