– కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయడం చూపడంపై వ్యవసాయ శాఖ మంత్రి మాజీ
హైదరాబాద్: ఎరువుల సబ్సిడీ గతేడాది బడ్జెట్ లో ఫర్టిలైజర్ రివైజ్డ్ ఎస్టిమేట్ రూ.1,71,299 కోట్లు ఉంటే, ఈ ఏడాది బడ్జెట్ ఎస్టిమేట్ రూ.1,67,887 కోట్లు మాత్రమే ఉంది. ఎరువులపై 3,412 కోట్ల సబ్సిడీని తగ్గించారు. ఇది వ్యవసాయ రంగం, రైతుల మీద తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఆహార సబ్సిడీ: 2023-24 బడ్జెట్ రూ.2,11,814 కోట్లు ఉంటే, గత బడ్జెట్ లో అతి తక్కువగా రూ.2,05,250 కోట్లకు తగ్గించారు. ఇప్పుడు దాన్ని 2,03,420 కోట్లకు తగ్గించారు.అంటే ప్రతి సంవత్సరం ఆహార సబ్సిడీని తగ్గిస్తూ పోవడమే కేంద్రం పనిగా పెట్టుకున్నది. ఇది పేద ప్రజల జీవితాల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. 2025 – 26 బడ్జెట్లో కేంద్రం రాజకీయ అవసరాలనే ఉపయోగించుకున్నది తప్ప దేశ సమ్మిళిత అభివృద్ధి మీద దృష్టి సారించలేదు.
ఇలాంటి బడ్జెట్ తో కేంద్రం పదే పదే చెప్పే వికసిత్ భారత్ సాధ్యం అవుతుందా ? దేశమంటే మట్టి కాదోయ్ .. దేశమంటే మనుషులోయ్ అన్న నిర్మలా సీతారామన్ దేశమంటే కొన్ని రాష్ట్రాలు మాత్రమే అన్నట్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం బాధాకరం.2024 లో పేజీ, 2025 ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ పెట్టారు .. 2026 యూపీ, 2027 గుజరాత్ కోసం బడ్జెట్ పెడతారా ?
బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా ? ఇద్దరు కేంద్రమంత్రులు సహా 8 మంది ఎంపీలు ఉండి ఏం సాధించారు? కేంద్ర జీడీపీకి 5.1 శాతం కంట్రిబ్యూషన్ ఇస్తున్న తెలంగాణ మరోసారి మోసపోయింది. నిధులు రాబట్టడంలో రేవంత్ సర్కార్ విఫలమైంది .. 40 వేల కోట్లు కావాలని తూతూ మంత్రం లేఖలు రాసి చేతులు దులుపుకున్నారు. ఏడాదిలో 30 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి ఏం సాధించారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు మొత్తం 16 మంది 8 రూపాయలు తేలేకపోయారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో కాంగ్రెస్, బీజేపీల వైపల్యాన్ని ప్రజలు గమనిస్తున్నారు.