Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత కూటమిదే

-అధ్వాన పాలనతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
-రానున్న ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం ఖాయం
-సత్తెనపల్లి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతోందని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలో తనపై ప్రజల ఆదరణ మరువ లేనిదన్నారు. జగన్‌రెడ్డి పాలనలో ఏపీ ప్రజలు చాలా కష్టాలు పడ్డారని, ఈ అధ్వాన పాలన చూడలేక ప్రజలు మార్పు కోరుకుంటున్నాన్నారు. యువత భవితకు కావాల్సిన నమ్మకం, భరోసాను ఈ జగన్‌ రెడ్డి ఈ జన్మకు ఇవ్వలేడు… రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు… ఒకటో తేదీ ఎవరికీ జీతాలు అందడం లేదు… తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఉద్యోగులందరికీ సకాలంలో జీతాలు అందుతాయి… పింఛనుదారులకు ప్రతినెలా నెల ఒకటో తేదీన పెన్షన్‌ అందుతుంది..మూడు పార్టీలు కలిసింది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు…దివాళా తీసిన రాష్ట్రానికి జవసత్వాలు కల్పించాలనే జత కట్టినట్లు వివరించారు.

ఈ ప్రభుత్వంలో ఇప్పటివరకు ఏడు సార్లు కరెంట్‌ చార్జీలు పెంచారని, కూటమి అధికారంలోకి రాగానే కరెంటు చార్జీల పెంపు ఉండదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్లు తిరిగి తెరుస్తామని పేర్కొన్నారు. నాసిరకం మద్యాన్ని నిర్మూలిస్తాం…గంజాయి, డ్రగ్స్‌ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందన్నారు. ఎన్నో సాగు, తాగునీటి ప్రాజెక్టులను టీడీపీ ప్రారంభించిందని, విభజన తర్వాత 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆర్థిక అవరోధాలు ఉన్నా ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టి ఐదేళ్లలో టీడీపీ సాగునీటి రంగానికి రూ.68 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. నీటి లభ్యత ఉంటేనే ఏ ప్రాంతంలో అయిన పరిశ్రమలు వచ్చి అభివృద్ధి చెందుతాయన్నానరు.

అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి, తల్లికి వందనం ద్వారా పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు, అన్నదాతకు ఏటా రూ.20 వేలు, దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు, 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి ద్వారా నెలకు రూ.1500, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, బీసీ వర్గాలకు 50 ఏళ్ల నుంచే రూ.4 వేల పింఛన్‌, మహిళలకు కలలకు రెక్కలు పథకం కింద వడ్డీలేని రుణాలు తదితర పథకాలను అమలు చేస్తామని తెలిపారు.

LEAVE A RESPONSE