Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ అధినేత చంద్రబాబు సంతకంతో ప్రచారంలో ఉన్న లేఖ ఫేక్

తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు ఎవరికీ ఎలాంటి సూచనలు చేయలేదు
చంద్రబాబు ఇమేజ్ ను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రలో భాగమే ఈ దొంగ లేఖ
ఫేక్ లేఖతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం
– కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి:- వైసీపీ బతుకే ఫేక్ బతుకని, ఫేక్ ప్రచారాలు, ఫేక్ లేఖలనే ఆ పార్టీ నమ్ముకుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కమ్మ సామాజికవర్గానికి చంద్రబాబు లేఖ రాసినట్లు ఒక ఫేక్ లేఖను ప్రచారంలో పెట్టడాన్ని ఖండించారు. ఈ లేఖ పూర్తిగా అవాస్తవమని చంద్రబాబు ఇమేజ్ ను దెబ్బతీసేందుకు వైసీపీ మొదటి నుంచి ఇలాంటి కుట్ర రాజకీయాలనే నమ్మకుందని అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం దూరంగా ఉందని చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు గానీ, అభిమానులకు గానీ ఎవరికి ఓటెయ్యాలి అనే విషయంలో ఎటువంటి సూచనలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కమ్మ సామాజికవర్గానికి చంద్రబాబు లేఖ రాసినట్లు ఒక ఫేక్ లేఖ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని దాన్ని నమ్మవద్దని అచ్చెన్నాయుడు కోరారు.

ఈ లేఖలో చంద్రబాబు సంతకం సైతం ఫోర్జరీ చేశారని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పోలీసు శాఖకు చిత్తశుద్ది ఉంటే ప్రతిపక్ష పార్టీలు, నేతలపై అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు కోరారు.

LEAVE A RESPONSE