– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
అమరావతి : వేల కోట్ల రూపాయలను అక్రమంగా కొల్లగొట్టిన మైనింగ్ గజదొంగ గాలి జనార్దన్ రెడ్డికి నాంపల్లి సిబిఐ కోర్టు శిక్ష ఖరారు చేయటంపట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. 14 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టు తీర్పు ఇవ్వటంతో ఆలస్యంగానైనా అక్రమార్కులకు శిక్ష తప్పదని రుజువయింది. మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి కొల్లగొట్టిన వేలకోట్లను ప్రభుత్వం రికవరీ చేసి, ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.