కాళంగి నది ఉగ్రరూపం

పరిశ్రమ నిర్మాణ కార్మికులను ఓడ్డుకు చేరుస్తున్న NDRF బృందాలు
సూళ్ళూరుపేట: తారకేశ్వర పార్క్ లో కొత్తగా విండ్ ఎనర్జీ కంపెనీ నిర్మాణం జరుగుతుంది. అక్కడ 500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఉన్నట్లుండి కాళంగినది ప్రవాహం ఎక్కువ కావడంతో కంపెనీ నిర్మాణం పూర్తిగా నీట మునిగే దశకు చేరుకుంది.వెంటనే పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది కొంతమందిని


నిన్న రాత్రి పునరావాస కేంద్రాలకు తరలించారు. మరో కొందరు నది ప్రవాహం మధ్య చిక్కుకు పోవడంతో ఈ సమాచారం అందుకున్న మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నరేంద్ర, తహశీల్దార్ రవికుమార్, CI వెంకటేశ్వర్లు రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని NDRF బృందలకు సమాచారం ఇవ్వడంతో వారిని NDRF బృందలు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

Leave a Reply