ప్రభుత్వంపై విమర్శలు చేయడమే ప్రతిపక్ష పార్టీల లక్ష్యం

– మంత్రి తలసాని

ప్రభుత్వంపై విమర్శలు చేయడమే ప్రతిపక్ష పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయని, వాటిని సమర్ధవంతంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణా భవన్‌లో జరిగిన హైదరాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ జనరల్‌ బాడీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ముందుగా ఇటీవల మరణించిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్నకు సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా తలసాని శ్రీనివాస్ యాదవ్‌  మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ర్రాష్టం ఆదర్శవంతమైన పాలన తో దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్య్రకమాలను అమలు చేస్తుందని, తెలంగాణాప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్య్రకమాలను కేం్రదప్రభుత్వం, దేశంలోని పలు ర్రాష్టాలలో అమలు చేస్తున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ్రపజల పార్టీ అని, ్రపజల కోసం నిరంతరం పని చేస్తుందని అన్నారు.

పార్టీలోని అన్ని స్థాయిలలోని నాయకులు, కార్యకర్తల సాధక, బాధకాలను తెలుసుకొనే ఉద్దేశంతో ఆత్మీయ సమావేశాలను నిర్వహించాలని పార్టీ వర్కింగ్‌ ్రపెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశించారని చెప్పారు. ఈ ఆత్మీయ సమావేశాల నిర్వహణ కోసం జిల్లా ఇంచార్జిగా దాసోజుశ్రవణ్‌ను నియమించారని తెలిపారు.ప్రభుత్వం అనేక కార్య్రకమాలను అమలు చేస్తున్నా కాం్రగెస్‌, బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని,ప్రజలు అన్ని గమనిస్తున్నారని మంత్రి తలసాని తెలిపారు. బండి సంజయ్‌, రేవంత్‌ రెడ్డిలు నోటికి అడ్డు అదుపులేకుండా మాట్లాడుతున్నారని, తమ పద్దతులను మార్చుకోవాలని తలసాని శ్రీనివాస్యాదవ్‌ హితవు పలికారు. కేం్రదమంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డి తను ్రపాతినిద్యం వహిస్తున్న సికిం్రదాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పేపర్‌ లీకేజీ వ్యవహారంలో ప్రతిపక్షాలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి తలసాని మండిపడ్డారు. కేసీఆర్‌ను గెలవలేకనే బీజేపీ కుట్రలు – హైదరాబాద్‌ జిల్లా పార్టీ ఇంచార్జి దాసోజు ్రశవణ్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ..ప్రజా సంక్షేమం కోసం పనిచేసే పార్టీ అని, దేశంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దూసుకువెళ్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని హైదరాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ ఇంచార్జి దాసోజు ్రశవణ్‌ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ సారథ్యంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు ఆమలు చేస్తున్నామని చెప్పారు.

పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ నాయకత్వంలో హైదరాబాద్‌ గణనీయంగా అభివృద్ధి సాధించిందని, ప్రపంచమే హైదరాబాద్‌ నగరం వైపు చూసే విధంగా అహర్నిశలు మంత్రి కేటీఆర్‌ అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజలు మెచ్చేలా పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్‌పై బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని శ్రవణ్‌ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌ మార్చిన సీఎం కేసీఆర్‌ను గెలవలేక ఎమ్మెల్సీ కవితపై టార్గెట్‌గా అవసరపు కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలోనూ బీజేపీ కుట్ర ఉందని, రాజశేఖర్‌ రెడ్డి బీజేపీ కార్యకర్త అని చెప్పారు. రాజశేఖర్‌ రెడ్డి భార్యతో హైకోర్టులో ఫిటిషన్‌ వేయడంలో బీజేపీ పాత్ర ఉందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలోనూ బీజేపీ నిసిగ్గులా వ్యవహరించిందన్నారు. దేశంలో మచ్చలేని కేసీఆర్‌ ప్రభుత్వంపై బీజేపీ ప్రభుత్వం అక్కసు చూపుతుందని, ప్రజలంతా గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని బొంద పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారని శ్రవణ్‌ మండిపడ్డారు. గులాబీ సైన్యం సైతం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, బీజేపీ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని శ్రవణ్‌ పిలుపునిచ్చారు.

ఎవరు అదైర్య పడవద్దు
మూడవ సారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త మరింత కష్టపడదామని సూచించారు. కష్టపడే ప్రతి ఒక్క నాయకుడికి తగిన సమయంలో సరైన పదవితో గౌరవిస్తుందన్నారు. పార్టీ ఆవిర్బావం నుండి పార్టీ కోసం పని చేసిన వారు అనేక మంది ఉన్నారని, వారికి పార్టీ తగిన గౌరవం, గుర్తింపు ఇస్తుందని, ఎవరు అదైర్య పడవద్దని శ్రవణ్‌ చెప్పారు. పార్టీని మరింత బలోపేతం చేయాలని, అందుకు ్రపతి కార్యకర్త ్రపభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్య్రకమాలను ్రపజల్లోకి తీసుకెళ్ళాలని పిలుపునిచ్చారు. గడిచిన ఎనిమిదిన్నరేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, ప్రజల్లోనే ఉంటూ పార్టీ తీసుకునే కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. నాయకులు, కార్యకర్తల సమస్యలను ముఖ్యమం్రతి కేసీఆర్‌, మంత్రి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ సమావేశంలో హోంమం్రతి మహమూద్‌ అలీ, మేయర్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కాలేరు వెంకటేష్‌, డిప్యూటీ మేయర్‌ ్రశీలత రెడ్డి, కార్పోరేషన్‌ చైర్మన్‌ లు రావుల ్రశీధర్‌ రెడ్డి, విప్లవ్‌ కుమార్‌, సికిం్రదాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇంచార్జి తలసాని సాయి కిరణ్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే ్రశీనివాస్‌ రెడ్డి, మాజీ మేయర్‌ బొంతు రాంమోహన్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌ యాదవ్‌, వివిధ నియోజకవర్గాల ఇంచార్జిలు, కార్పొరేటర్‌ లు, మాజీ కార్పొరేటర్‌లు, డివిజన్‌ అద్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

వరుస ప్రోగ్రాంలతో గులాబీ దూకుడు
బీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడు మీదుంది. ఇందుకు ఆత్మీయ సమావేశాలతో జోష్‌ పెంచింది. గ్రేటర్‌ను హోరెత్తించేలా వరుస కార్యక్రమాలను తీసుకుంది. ఈ మేరకు ఆత్మీయ సమావేశాలతో మొదలై…అక్టోబరు నెలలో వరంగల్‌లో జరిగే భారీ బహిరంగ సభ వరకు వరుస కార్యక్రమాలను తీసుకుంది. వచ్చే నెల 14న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ భారీ విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఈ రోజు ప్రతి నియోజకవర్గాల్లో అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాల వేసి ర్యాలీగా ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగే సభకు హాజరు కావాలని శ్రవణ్‌ చెప్పారు.
ఏఫ్రిల్‌ 25న నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల సమావేశం, ఏఫ్రిల్‌ 27న పార్టీ ప్లీనరీ సందర్భంగా జెండా పండగ, ఏఫ్రిల్‌ 30న బీఆర్‌ అంబేద్కర్‌ పేరిట కొత్త సచివాలయ ప్రారంభం సందర్భంగా తీర్మానాలు, పాలాభిషేకాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు శ్రవణ్‌ పేర్కొన్నారు. మే 1న కార్మికులతో కలిసి కార్మిక దినోత్సవ వేడుకలు, మే నెలలోనే ప్రతి ఒక్కరూ సోషల్‌ మీడియా అకౌంట్లు తెరిచి బీజేపీ కుట్రలను తిప్పికొట్టేలా సిద్దం కావడం, యూత్‌ విభాగాన్ని బలోపేతం చేయడం లాంటివి చేపడతామని పేర్కొన్నారు.
జూన్‌ 1 ఆమర వీరుల స్మృతి భవన ప్రారంభం, జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబురాలు, ఆగస్టు 16న దళితబందు రెండవ వార్షికోత్సవ వేడుకలు, లబ్ధిదారులతో సమావేశాలు ఉంటాయన్నారు. అక్టోబరు నెలలో వరంగల్‌ మహా సభ ఉంటుందని, వరుస ప్రోగ్రాంలను విజయవంతం చేయాలని శ్రేణులకు శ్రవణ్‌ పిలుపునిచ్చారు.

Leave a Reply