Suryaa.co.in

Telangana

పెవిలియన్ రద్దీగా తెలంగాణ

– 50 వేల నుంచి 75 వేల ఉద్యోగాలు లభించే అవకాశం
– టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్: దావోస్ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 50 వేల నుంచి 75 వేల ఉద్యోగాలు లభించే అవకాశముందని, బీఆర్ఎస్ గత పదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. దావోస్‌లో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లడం వల్ల పెట్టుబడులపై నమ్మకం కుదిరిందన్నారు. తెలంగాణ పెవిలియన్ రద్దీగా మారిందని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. మంచి జరుగుతుంటే ప్రశంసించడం నేర్చుకోవాలని ప్రతిపక్షానికి హితవు పలికారు.

ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడమే బీఆర్ఎస్ పని అని, గత ప్రభుత్వ పాలన కారణంగా నెలకు ఆరున్నర వేల కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నట్లు పేర్కొన్నారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పెద్దగా తెచ్చిన పెట్టుబడులు లేవన్నారు. అభివృద్ధి, పెట్టుబడులపై బీఆర్ఎస్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. తమని విమర్శించే ప్రతిపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.

LEAVE A RESPONSE