ముగ్గురు చనిపోవడం వెనుక అధికారపార్టీ స్లీపర్స్ సెల్స్ పాత్ర

-అమాయకులు బలైన ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి
-గుంటూరు ఘటనలో ప్రభుత్వ కుట్ర ఉంది
-నవంబర్లో వైసీపీ సోషల్ మీడియాలో వచ్చిన సందేశం, గుంటూరులో ముగ్గురిమృతి వెనుక పాలకుల ప్రమేయాన్ని ఎత్తిచూపుతుంది
-చంద్రబాబు సభలను భగ్నం చేయడానికే ప్రభుత్వం నిన్న గుంటూరులో దారుణానికి పాల్పడింది. చంద్రబాబు కార్యక్రమంలో ముగ్గురు చనిపోవడం వెనుక అధికారపార్టీ స్లీపర్స్ సెల్స్ పాత్రఉంది. జనవరి నుంచి జగనన్న అసలు రాజకీయం చూస్తారు అన్న వైసీపీ సోషల్ మీడియా సందేశం దేనికి సంకేతం?
-అమయాకుల్ని బలిగొనడమే జగనన్న అసలు రాజకీయమా? అసలు రాజకీయం అంటే జైలు రాజకీయమా..లేక బాబాయ్ ని చంపిన రాజకీయమా?
-టీడీపీ జాతీయ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య

“ చంద్రబాబు సభలు, కార్యక్రమాలకు వస్తున్న జనాన్ని చూసి ముఖ్యమంత్రి గంగవెర్రులెత్తుతున్నారు. గుంటూరులో నిన్న ఒక ఎన్ఆర్ఐ పేదలకు వస్త్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.సదరు కార్యక్రమం గురించి ముందుగానే నిర్వాహకులు పోలీసులకు చెప్పారు. సదరు కార్యక్రమానికి 200మంది పోలీసులతో బందోబస్త్ ఏర్పాటుచేశామని, నిర్వాహకులు కూడా వారికి సహకరించారని చెప్పారు.

ఆ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని వెళ్లాకే దురదృష్టకర ఘటన జరిగింది.200 మంది పోలీసులు భద్రతలో ఉన్నా, చంద్రబాబు కార్యక్రమానంతరం వెళ్లిపోయాక అక్కడ ముగ్గురు ఎలాచనిపోయారు?వారు నిజంగానే చనిపోయారా..లేక చంపబడ్డారా అనేది ప్రభుత్వమే చెప్పాలి.ముఖ్యమంత్రి, ఆయనప్రభుత్వమే ఈ మరణాలకు కారణమని తానంటాను.

ప్రతిపక్షనేత చంద్రబాబుగారి సభలకు వస్తున్న ప్రజాస్పందన చూసి ఓర్వలేకనే ఈ ప్రభుత్వం ఇలాంటి దారుణాలకు పాల్పడుతోంది. గుంటూరులో చంద్రబాబు కార్యక్రమంలో ముగ్గురు చనిపోవడం వెనుక అధికారపార్టీ స్లీపర్స్ సెల్స్ పాత్ర ఉంది. అంత కచ్చితంగా ఎలా చెబుతున్నామంటే, ఘటన జరిగిన 10నిమిషాల్లోనే మరణవార్త నేషనల్ మీడియాలో వచ్చింది. ఎలా వచ్చిందో ప్రభుత్వమే చెప్పాలి.

సదరు ఘటనపై నేషనల్ మీడియాకు ముందే ఎవరు ఉప్పందించారు?ఇండియాటుడే, న్యూస్ 18 ఛానళ్లలో నిమిషాల్లో ఘటన తాలూకా వార్తలు ప్రసారమయ్యాయి. ఘటన జరిగిన వెంటనే కేవలం 5 నిమిషాల్లోనే సాక్షి ఛానల్ లో వచ్చింది. చంద్రబాబు సభలను భగ్రం చేయడానికే ప్రభుత్వం నిన్న గుంటూరులో ముగ్గుర్ని చంపింది.గుంటూరుజిల్లా ఎస్పీ ఆరిఫ్ సిన్సియర్ ఆఫీసర్, ఆయన నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలి.ముగ్గురి మరణం వెనకున్నకుట్రను చేధించాలి. వారు ముగ్గురు నిజంగానే చంపబడ్డారు. ఘటన మొత్తం బహిరంగ కుట్రే. ఘటనపై 120 (బీ) మరియు 302 కేసుపెట్టండి.

గుంటూరు ఘటనలో అన్నివేళ్లు ప్రభుత్వంవైపే చూపించబడుతున్నాయి. ఇదివరకు రాష్ట్రంలో ఎన్నిఘటనలు జరిగినా ఎప్పటికో తీరుబడిగా స్పందించే మంత్రులు, నిన్న గుంటూరు ఘటన జరిగినవెంటనే బృందాలు, బృందాలుగా ఘటనాస్థలికి వెళ్లారు.పేదలు పండుగలు చేసుకోవడానికి ఈ ప్రభుత్వం ఎవరికీ ఏమీ ఇచ్చిందిలేదు. కానీ ఎవరో ఎన్ఆర్ఐ పేదలకు సాయంచేయాలన్న సదుద్దేశంతో, గుంటూరులో ఒక కార్యక్రమం చేపట్టి, దానికి చంద్రబాబుగారిని ఆహ్వానిస్తే, దాన్ని భగ్నం చేయాలని చూస్తారా?

ప్రజల్లో అధికారపార్టీపై ఉన్న వ్యతిరేకతను ఆపలేక, చంద్రబాబుగారి సభలు, కార్యక్రమాలకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే పాలకులు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు.గుంటూరు దుర్ఘటనపై ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలి. రాష్ట్ర పోలీసులదర్యాప్తులో అసలు వాస్తవాలు బయటకురావు, అసలుదోషులు దొరకరు.

గుంటూరు జిల్లా ఎస్పీని సక్రమంగా దర్యాప్తుచేయనిస్తే, నిందితుల్ని పట్టుకోగలరు. కానీ ప్రభుత్వం ఆయన్ని ఈ ఘటనలో అడుగు ముందుకు వేయనివ్వదు.“జగనన్న అసలురాజకీయం రేపు జనవరి నుంచి చూస్తారు, ఒక్కొక్కడు వణకాల్సిందే కావాలంటే ఈ మెసేజ్ స్క్రీన్ షాట్ తీసిపెట్టుకోండి.” అంటూ నవంబర్లో వైసీపీ సోషల్ మీడియాలో మెసేజ్ లు రావడం వెనకున్న ప్రధాన ఉద్దేశం, అంతిమలక్ష్యం ఇలా సామాన్యుల్ని బలితీసుకోవడమేనా?

జనవరి నుంచి జగనన్న అసలు రాజకీయం చూస్తారంటే, జైలు రాజకీయమా..లేక బాబాయ్ ని చంపిన రాజకీయమా?మొద్దుశీనుని, డాక్టర్ సుధాకర్ ని, విక్రమ్ కుమార్ లాంటి దళితుల్ని చంపిన రాజకీయమా? మంచి ఉద్దేశంతో పేదలకు సాయంచేయాలని వచ్చిన ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాసరావు మనసుని ఈప్రభుత్వం తీవ్రంగా గాయపరిచింది.ప్రభుత్వమే ఈవిధంగా కుట్రలు పన్నుతుంటే, పేదలకు సాయం చేయడానికి ఎవరు ముందుకొస్తారు?

ఉయ్యూరి శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. అతని అరెస్ట్ ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. శ్రీనివాస్ ని అరెస్టు చేసిన ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం, ధృతరాష్ట్ర ప్రభుత్వం, పనికిమాలిన ప్రభుత్వం.ముఖ్యమంత్రే ఇబ్బందిపెడుతుంటే రాష్ట్రంలోని పేదప్రజలు ఎటువెళ్లాలి? పెద్దపెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు ముఖ్యమంత్రిగారు!ముస్సోలిని, హిట్లర్, అలెగ్జాండర్ వంటి మహామహా నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు. ఎన్నిలక్షలకోట్లు పోగేసుకున్నా, ఎన్నిబంగ్లాలు కట్టుకున్నా, అవేవీ మీ వెంటరావని తెలుసుకోండి ముఖ్యమంత్రిగారు.”

Leave a Reply