Suryaa.co.in

Andhra Pradesh

ఖమ్మం గుమ్మంలో ఎగిరేది కాషాయ జెండానే

– హామీలపై అడగండి, నిలదీయండి, ప్రశ్నించండి

• 60 ఏండ్లు ఆగం చేశారని, ఉద్యమ పార్టీకి అధికారం ఇస్తే ఉన్నదంతా ఊడ్చేశారు
• పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో అందినంత దోచుకున్నారు, దాచుకున్నారు
• గ్యారంటీల పేరుతో, వారంటీలపేరుతో…డేట్లు, డెడ్ లైన్లు పెట్టి, ప్రజలను నమ్మించి మోసం చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు హస్తం పార్టీ నాయకులు
– నమ్మి నానబోస్తే పుచ్చిబూరెలైనట్లు ఉంది, కాంగ్రెస్ నాయకుల పాలన
• హస్తం పార్టీ 60 రోజుల పాలనలోనే ప్రజలకు అసలు విషయం అర్థమైంది
• 412 హామీలు వాళ్లు అధికారంలోకి రావడానికి వాడుకున్న మాటలేతప్పా…నిజంగా ప్రజలకు కోసం కాదని

– బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం : స్వయంగా ఈజిల్లానాయకులే ఉపముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనే అసలు బండారం బయటపడింది. మాట ఇచ్చినట్లుగా హామీలు అమలు చేయాలంటే, ప్రతీ హామీకి నిధులు కేటాయించి చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సి ఉండే, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేది ఉండే.

బడ్జెట్ లో ప్రభుత్వం ఏం చెప్పిందో….ఏం చేసిందో..ఎంత కేటాయింపులు చేసిందో మీరు కూడా చూశారు. రెవెన్యూ మంత్రిగా ఉన్న పొంగులేటి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం ప్రాజలకైనా సమాధానం చెప్పాలి. 412 హామీలు కాదు కదా, కనీసం వారు అనుకుంటున్న ఆరు హామీలకు కూడా నిధులు కేటాయించకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేయబోతున్న విషయాన్ని సభా సాక్షిగా బయటపెట్టింది.

డిసెంబర్ 9నే రుణమాఫీ, వందరోజుల్లోనే హామీలు పూర్తి చేస్తాం, ఫిబ్రవరిలోనే జాబ్ క్యాలండర్ వేస్తాం, ఇలా డేట్లు డెడ్ లైన్లు పెట్టింది కాంగ్రెస్ నాయకులే. ఇప్పుడు ఆ డేట్లు, డెడ్ లైన్ గడువు ముగిశాయి. ఇంకోన్ని రోజులైతే 100డేస్ డైడ్ లైన్ వస్తుంది. గ్యాంరంటీలు, వారంటీలు అంటూ మీరు చెప్పినప్పుడు ఏమైందని ప్రజలు అడగడంలో తప్పులేదు.

దానికి అధికారంలోనే ఉన్న మీరే అసహనానికి గురైన హామీలు అడిగితే చెప్పుతో కొట్టండనే దాకా వచ్చారంటే ఓట్లేసిన ప్రజలపై మీకు ఎంత గౌరవం ఉందో అర్థమవుతోంది. ఉద్యమాల పురిటిగడ్డ, అడవిబిడ్డల నేల ఖమ్మం. ఇక్కడి ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎక్కువ సీట్లు ఇచ్చారు, ఇప్పుడు నమ్మిన ప్రజలను హామీలు అమలు చేయకుండా నట్టేట ముంచుతున్నారు

ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా….గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ కోరి వాస్తవాలు బయటపట్టే వరకు , ప్రజలపక్షంగా ప్రతిపక్షంగా బీజేపీ పోరాటం చేస్తూనే ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కల్లబొల్లి మాటలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు, మళ్లీ లోక్ సభ ఎన్నికల ముందు మళ్లీ మీ ఇండ్ల ముందుకొస్తారు .

హామీలపై అడగండి, నిలదీయండి, ప్రశ్నించండి, మీకు అండగా బీజేపీ పార్టీ పోరాటం చేస్తుంది. ఒకప్పుడు కమ్యూనిస్టుల కోట ఖమ్మం కల్లబొల్లి మాటలతో కాంగ్రెసొళ్లు కబ్జా చేశారు. ఇప్పుడు కదనరంగంలోకి కషాయ దళం వచ్చింది. ఇక ఖమ్మం గుమ్మంలో ఎగిరేది కమలం జెండానే.

 

LEAVE A RESPONSE