Suryaa.co.in

Telangana

నెమళ్ళు అరుస్తుంటే కన్నీరొస్తోంది

– ప్రకృతితో యుద్ధం చేస్తున్నారు
– దాశరథి శత ఉత్సవాల్లో భాగంగా “ఆ చల్లని సముద్ర గర్భం” దృశ్యగీతాన్ని రూపొందించిన తెలంగాణ జాగృతి
– దృశ్య గీతం ఆవిష్కరణ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
– కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రకృతి విధ్వంసం పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన

హైదరాబాద్: నెమళ్ళు అరుస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. లేళ్లకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. చెట్లను నరికి ప్రకృతితో యుద్ధం చేస్తున్నారు. పర్యావరణ హణనానికి పాల్పడుతున్నారు.కేసీఆర్ హయాంలో తెలంగాణలో అడవులు 7.7 శాతం పెరిగాయి. ఇప్పుడు రాష్ట్రంలో చెట్లను నరికేసే పరిపాలన సాగుతున్నది. తెలంగాణ నేల మీద ఇప్పుడు మరో ఉద్యమం జరుగుతున్నది.

నిజాం రాజు ఎన్ని హింసలు పెట్టినా దాశరథి తెలంగాణ వాదాన్ని వదలలేదు.ప్రతి ప్రజా ఉద్యమంలో పాల్పంచుకున్న గొప్ప వ్యక్తి దాశరథి. తెలంగాణ ఉద్యమానికి దాశరథి రచనలు స్ఫూర్తినిచ్చాయి.పోరాటానికి మందుగుండు సామాగ్రిని దాశరథి తయారు చేశారు.

ఈ ప్రభుత్వానికి తెలంగాణ సోయి లేదు.. తెలంగాణ కోణంలో పరిపాలన జరగడం లేదు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది.

LEAVE A RESPONSE