Home » నా భూమి కబ్జాచేసి పార్టీ ఆఫీసు కడుతున్నారు

నా భూమి కబ్జాచేసి పార్టీ ఆఫీసు కడుతున్నారు

– మాజీ మంత్రి అనిల్‌పై పోలీసులకు మహిళ ఫిర్యాదు

నెల్లూరు: వైకాపాకు చెందిన మాజీ మంత్రి అనిల్‌పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన స్థలం కబ్జా చేశారని ఆరోపిస్తూ కౌసర్‌ జాన్‌ చిన్నబజార్‌ సీఐకు ఫిర్యాదు అందజేశారు. నెల్లూరు భగత్‌సింగ్‌ కాలనీలోని తమ స్థలంలో వైకాపా ఆఫీసు కడుతున్నారని అందులో పేర్కొన్నారు. ఈ విషయంలో న్యాయం చేయాలని ఏడాదిగా పోరాటం చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. 2002లో తన భర్త కొన్న స్థలంలో 2.8 ఎకరాలు ఆక్రమించారని తెలిపారు. అధికారులు దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply