Suryaa.co.in

Andhra Pradesh

భద్రతాదారుడు లేక ఖాళీగా దర్శనమిస్తున్న టూరిస్ట్ పోలీస్ అవుట్ పోస్ట్

(వాసు)

మంగళగిరి: శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నిత్యం వచ్చి పోయే భక్తుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. టూరిస్ట్ అవుట్ పోస్టులో ఒక కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తూ ఉంటారు.గత కొంత కాలం నుండి టూరిస్ట్ పోలీస్ ఔట్ పోస్ట్ లో ఎవరూ విధులు నిర్వహించకపోవడంతో ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తుంది.

ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి నిత్యం భక్తులు వచ్చి పూజలు చేస్తూ మొక్కలు తీర్చుకుంటూ పానకాల నరసింహస్వామిని దర్శించుకుంటారు. అధికంగా దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అభద్రత లేకుండా ఉండేందుకు టూరిస్ట్ పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేశారు.కానీ పోలీసులు ఎవరు విధులు, నిర్వహించకపోవడంతో వచ్చిన భక్తులకు ఖాళీగా దర్శనమిస్తుంది.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడి దగ్గర ప్రధానంగా ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రతరం అవుతుంది. అవుట్ పోస్టులో పోలీస్ సిబ్బంది ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్య కూడా కొంతవరకు తీరవచ్చునని ప్రజలు, భక్తులు కోరుతున్నారు. నిత్యం ఇక్కడికి వచ్చే వాహనాలకు భక్తులకు భద్రత కల్పించేందుకు ఈ టూరిస్ట్ పోలీస్ అవుట్ పోస్ట్ లో పోలీస్ వారు విధులు నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు.

LEAVE A RESPONSE