ఎన్టీఆర్ స్ఫూర్తి – చంద్రన్న భరోసా పేరుతో రేపటి నుంచి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు

అనకాపల్లి జిల్లా చోడవరంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా రేపు జిల్లా మహానాడు

అమరావతి:- తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పర్యటనలు ప్రారంభం అవుతున్నాయి. ఎన్టీఆర్ స్ఫూర్తి – చంద్రన్న భరోసా పేరుతో ఏడాది పాటు పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనలు ఉంటాయి. ఒక్కో టూర్ లో మూడు రోజుల పాటు చంద్రబాబు జిల్లాలలో పర్యటించనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, విధ్వంస పాలనపై ప్రజల భవిష్యత్ కు భరోసా ఇచ్చేలా అధినేత టూర్లు ఉండనున్నాయి. NTR శతజయంతిపై ఏడాది ఉత్సవాల నిర్వహణలో భాగంగా రేపు అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో తొలి జిల్లా మహానాడు జరుగుతుంది. టూర్లో మొదటి రోజు మహానాడు మహాసభ ఏర్పాటు చేస్తున్నారు. రెండో రోజు పార్లమెంట్ లోని 7 నియోజకవర్గాల నేతలు, ముఖ్య కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరుగుతుంది. మూడో రోజు ప్రజా సమస్యలు, ప్రభుత్వ బాదుడే బాదుడు పై రోడ్ షోలు ఉంటాయి. ఏడాది పాటు 100 కి పైగా నియోజకవర్గాలు కవర్ అయ్యేలా చంద్రబాబు పర్యటనలు చెయ్యనున్నారు. నెలకు రెండు టూర్లు ఉండేలా ప్రణాళిక సిద్దం చేశారు.

Leave a Reply