Suryaa.co.in

Telangana

చేప మందు పంపిణీలో విషాదం

– తొక్కిసలాట జరిగి ఒక వ్యక్తి మృతి

హైదరాబాద్ : హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. క్యూ లైన్లో నిలబడ్డ ఓ వ్యక్తి తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే అక్కడి వారు ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు నిజామాబాద్ జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు.

LEAVE A RESPONSE