Suryaa.co.in

Andhra Pradesh

విజయవాడలో అనధికార విదేశీ మద్యం నిల్వలు

– ఒకరు అరెస్ట్

విజయవాడ : విశ్వసనీయ సమాచారం ఆధారంగా, మల్టీ జోన్-II, మంగళగిరికి చెందిన ఎన్ఫోర్స్‌మెంట్ సూపరింటెండ్ సి. మధు బాబు ఆధ్వర్యంలో, విజయవాడ వెస్ట్ ఎక్సైజ్ స్టేషన్‌ ఎస్‌.హెచ్‌.ఓ, సిబ్బంది సహకారంతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో అనేక రాష్ట్రాలు, విదేశీ బ్రాండ్లతో కూడిన స్కాచ్ మద్యం నిల్వలు వెలుగులోకి వచ్చాయు.

ఈ దాడిలో 123 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవి 30 మిల్లీలీటర్ల నుండి 2 లీటర్ల వరకు వివిధ పరిమాణాలలో ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న మద్యం బ్రాండ్లు గోవా, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు మలేసియా, సింగపూర్ వంటి విదేశాల నుండీ తీసుకువచ్చినవిగా గుర్తించారు. ఈ మద్యం నిల్వను విజయవాడ వెస్ట్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని నున్న రోడ్‌లోని తోటవారి వీధిలోని శ్రీ కృష్ణ రెసిడెన్సీలో ఉన్న ఓ గృహంలో గుర్తించారు. చట్టపరమైన నోటీసు జారీ చేసి ఇంట్లో సోదా నిర్వహించి ఒక మహిళను అరెస్ట్ చేశారు.

ప్రాథమిక విచారణలో, ఆమె అనేక ప్రాంతాలు సందర్శించినప్పుడు ఈ మద్యం కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేసిందని అంగీకరించింది. ఆమె ఒక వివాహాలు, ఇతర ప్రైవేట్ ఈవెంట్లకు ఈవెంట్ మేనేజర్‌గా పని చేస్తూ, అలాంటి సందర్భాల్లో విజయవాడలోని ఎలైట్ వర్గాలకు మద్యం సరఫరా చేస్తుందని వెల్లడించింది.

ఎక్సైజ్, జిఏడి ( రాజకీయం) శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాల మేరకు, ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షణలో నిర్వహించబడింది. ఈ కేసు విజయవాడ వెస్ట్ ఎక్సైజ్ స్టేషన్ ఎస్‌.హెచ్‌.ఓ ద్వారా మల్టీ జోన్-II, ఎస్‌.టి‌.ఎఫ్., మంగళగిరి మార్గదర్శకత్వంలో నమోదు చేయబడింది. మరింత దర్యాప్తు కొనసాగుతోంది.

LEAVE A RESPONSE