– బార్స్, వైన్స్, బెల్ట్ షాపులు పెంచటంపై చర్చించాలి
– చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులపై కూడా సభలో చర్చించాలని కోరాం
– బీఏసీ సమావేశం తర్వాత హరీష్ రావు చిట్ చాట్
హైదరాబాద్: కనీసం 20రోజులు అసెంబ్లీ నడపాలని బీఏసీలో డిమాండ్ చేశాం.ప్రశ్న పత్రాలు లీక్ అయినట్లు.. అసెంబ్లీ బిజినెస్ ముందే లీక్ అవటంపై అభ్యంతరం తెలిపాం. ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వొద్దని సీఎం స్వయంగా స్పీకర్ ను బుల్డోజ్ చేస్తున్న విషయాన్ని బీఏసీలో లేవనెత్తాం.
సంఖ్య బలాన్ని బట్టి బీఆర్ఎస్ కు సభలో సమయం ఇవ్వాలని కోరాం. మా విజ్ఞప్తికి ఓకే అన్నారు.రైతాంగ సమస్యలు, తాగు ,సాగు నీటి సమస్యలపై చర్చించాలని కోరాం. వివిధ (సుంఖిశాల,పెద్దవాగు కొట్టుకుపోవడం,vattem పంప్ హౌస్ మునిగిపోవడం,ఎస్ ఎల్ బిసి ప్రమాదం) ప్రాజక్టులు కూలిపోవటంపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశాం. మంత్రులు సభకు ప్రిపేర్ అయ్యి రావాలని కోరాం.
అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి స్పీకర్ చొరవ తీసుకుని నిధులు ఇప్పించాలని కోరాం. కృష్ణా నదీ జలాల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సభలో చర్చించాలని బీఏసీలో చెప్పాం. ఏపీ నీళ్ళు తరలించుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూసింది. బిల్లులు చెల్లింపుకు 20 శాతం కమిషన్ విషయాన్ని అసెంబ్లీలో చర్చించాలని కోరాం. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవటం చర్చించాలి.
బార్స్, వైన్స్, బెల్ట్ షాపులు పెంచటంపై చర్చించాలి. ఎల్ఆర్ఎస్ ఉచిత హామీపై చర్చ జరపాలని డిమాండ్ చేశాం. కాళేశ్వరం ప్రాజెక్టును కూలిన పిల్లర్ ను కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని బీఏసీలో చెప్పాం,వెంటనే కాళేశ్వరం పునరుద్ధరణ పనులు చేయాలని కోరాం. నిరుద్యోగభృతి, జాబ్ క్యాలెండర్ పై అసెంబ్లీలో చర్చించాలి. చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులపై కూడా సభలో చర్చించాలని కోరాం.