Suryaa.co.in

Andhra Pradesh

వంశీకి 7 వరకు రిమాండ్‌

విజయవాడ: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బుధవారం విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ రిమాండ్ ముగిసింది. దీంతో ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. వచ్చే నెల 7 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దాడి జరిగింది. ఆ సమయంలో స్థానిక ఎమ్మెల్యేగా ఉండి అనుయాయులు, వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారని మాజీ ఎమ్మెల్యేపై అభియోగాలు ఉన్నాయి.

ఈ కేసులో 72వ నిందితుడిగా వంశీ ఉన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసులో కూడా వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

LEAVE A RESPONSE