Home » జవహర్ రెడ్డిది నీతి మాలిన చర్య

జవహర్ రెడ్డిది నీతి మాలిన చర్య

-దళితుల భూమిని అప్పనంగా సీఎస్ కుమారుడికి కట్టబెట్టేందుకే జీవో నెం.596 విడుదల చేసిన సీఎస్
-దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు ఈ ప్రభుత్వంలో సీఎస్ కుమారుడి భూదోపిడి ఉన్నది
-ఎన్నికల కమిషన్ వెంటనే జవహర్ రెడ్డి పాస్ పోర్టును సీజ్ చేసి, ఎయిర్ పోర్టులన్నిటినీ అలెర్ట్ చేసి అతనిపై నిరంతర ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలి
-CBI దర్యాప్తుకు ఆదేశించి విశాఖపట్టణం భూభాగోతాలపై విస్తృత విచారణ జరిపించాలి
– తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

దొంగలు, దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా జగన్ రెడ్డి గ్యాంగ్ పేదల భూములను దోచుకొని, పంచుకుంటున్నారు. విశాఖలో దళితుల అసైన్డ్ భూములను సీఎస్ జవహర్ రెడ్డి కుమారుడు మింగాలని ప్రయత్నించడం మహాఘోరం. పేదవాడి భూమిని కొట్టేయడమే సీఎస్ జవహర్ రెడ్డి చట్టమా? సుమారు రూ.4 వేల కోట్లు విలువగల 800 ఎకరాల అసైన్డ్ భూముని తన కుమారిడికి అప్పనంగా కట్టబెట్టేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జివో నెం.596 విడుదల చేయడం ఘోరాతిఘోరం.

రాష్ట్రంలోని IAS అధికారులకు ఆదర్శంగా నిలబడాల్సిన సీఎసే బరితెగించి భూభకాసురుని వేషం వేస్తే రాష్ట్రంలో న్యాయం చేసేదెవరు? అన్యాయం జరుగుతుందయ్యా… మాకు న్యాయం చెయ్యండి అని ఎవరినైతే వేడుకుంటామో అతనే అన్యాయాలు చేస్తుంటే ఇంకెవరికి చెప్పాలో అర్థం కావడం లేదు. పేదవారు, ఆకలి మంటతో ఉన్నారు కాబట్టి వారి ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయండని సీఎస్ జవహర్ రెడ్డిని మేము వేడుకున్నా… చస్తే చావనివ్వండి అన్నట్లు నిర్లక్షంగా సమాధానం చెప్పారు. పేద ప్రజల ఉసురుపోసుకోవడం వలనే సీఎస్ జవహర్ రెడ్డి భూభాగోతం బయటపడింది. ఇలా IAS, IPS అధికారులే దొంగతనాలు చేస్తే ఇక న్యాయం కోసం ప్రజలు ఎవరి కాళ్లు పట్టుకోవాలి? ఉత్తరాంధ్రలో దాదాపు 60% భూములను కడప వాళ్లే కొట్టేశారు. కడప వాళ్లకి ఇక్కడ పనేంటని మంత్రి ధర్మాన కూడా అన్నారు.

పేద దళితులు(మాల, మాదిగలు) జీవనోపాధి కోసం ప్రభుత్వమిచ్చిన అసైన్డ్ భూములను మదించిన ఏనుగుల్లాంటి ఇటువంటి అధికారులు, వారి అండతో రాజకీయ నాయకులు కొట్టేయడం దుర్మార్గం, పాపం కూడా. గతంలో కూడా ఈనాటి ముఖ్యమంత్రి తండ్రి, తాత కూడా వేలాది ఎకరాల దళితుల భూములు దిగమింగి, సాక్షాత్తు శాసనసభలోనే అంగీకరించిన విషయం కూడా మనం చూశాం.

దళితుల భూములు కొనకూడదు, ఆక్రమించకూడదు అని చట్టాలున్నా ఎంతోమంది అధికారులు, బరితెగించిన రాజకీయ పెద్దలు, డబ్బు మదంతో కొట్టుమిట్టాడుతున్న వారు దళితుల భూములను, వారి అవసరాలను ఆసరాగా తీసుకొని కొద్దో గొప్పో ధనాన్ని వాళ్ల ముఖాన కొట్టి… కోట్లు విలువు చేసే అసైన్డ్ భూములను దోచేశారు. ఆ దళితులు మాత్రం భూమి లేని పేదవారిగా మునుపటి స్థితిలోనే మ్రగ్గుతున్నారు.

రేపు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదివి చేపట్టిన వెంటనే అధికారాన్ని ఉపయోగించుకొని, దళితుల భూములను దండుకొని, వారికి అన్యాయం చేస్తున్న సీఎస్ జవహర్ రెడ్డి, వారు కుమారుల్లాంటి ఘరానా పెద్దలను వదలకుండా శిక్షించి, వారి వద్ద నుండి అసైన్డ్ భూములు స్వాధీనం చేసుకొని, రాష్ట్రంలోని పేదవారికి పంచాలని, అవసరమైతే అసైన్డ్ భూములను కొట్టేసిన భూబకాసురులపై ‘ఒక కమిషన్’ వేయాలని కూడా మా అధినేతను కోరుతాం.

సీఎస్ జవహర్ రెడ్డి ఈ రోజు నుండి ఏ ఫైల్ చూడకుండా, ముఖ్యంగా భూ వ్యవహారలకు చెందిన ఫైల్స్ చూడకుండా ఎన్నికల సంఘం కంట్రోల్ చేయాలి. విశాఖకు చెందిన ఏ అధికారి కూడా ఆయనను కలవకుండా నిరోధించాలి. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను అలెర్ట్ చేసి సీఎస్ జవహార్ రెడ్డి విదేశాలకు పోకుండా పాస్ పోర్ట్‌ను స్వాధీన పరుచుకోవాలి. ఆయన కదలికలపై ‘సరైన’ నిరంతర ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలి.

ఈ భూభాగోతంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి, ‘CBI’ దర్యాప్తుకు ఆదేశించి, ఈ కేసులో పూర్తి నిజానిజాలు బయటకుతీయాలి. దీనిలోని భూ కబ్జాదారులపైన, భూ దొంగలపైన కఠిన చర్యలు తీసుకోవాలి. జవహర్ రెడ్డి రిటైర్ కాకుమునుపే విచారణ పూర్తి చేయాలి. శుప్త చేతనావస్థలో సీఎస్‌ను పెట్టి, ఆయనను విచారించి, ఆయన భూభాగోతాలను ప్రజలకు తెలియజేయాలి. గత ఐదేళ్లుగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో జరిగిన భూ క్రయ విక్రయాలపై కూడా ‘మరో కమిషన్’ వేసి విచారణ జరిపించాలని చంద్రబాబును కోరుతాం.

Leave a Reply