విశాఖపట్నం త్వరలో పరిపాలన రాజధాని కానుంది: వై వి సుబ్బారెడ్డి

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా విశాఖపట్నం త్వరలో పరిపాలన రాజధాని కానుందని ఉమ్మడి విశాఖ వైయస్ఆర్‌సీపీ రీజనల్‌ కో-ఆర్డినేటర్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.సామాజిక న్యాయం పేరిట అన్నివర్గాల వారికీ తగిన ప్రాధాన్యం కల్పిస్తూ ప్రస్తుత రాజకీయాలకు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రోల్‌ మోడల్‌గా నిలిచారని కొనియాడారు. విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని, చివరకు వరద బాధితులను పరామర్శించడానికి వెళుతూ కూడా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. వరద నీటిని చూపించి తాగునీరు అంటూ మాట్లాడటానికి ఇంగిత జ్ఞానం ఉండాలని అన్నారు. వరద బాధితులను తక్షణ సహాయం అందిస్తూ ప్రభుత్వం ఆదుకుంటోందని తెలిపారు.

Leave a Reply