Suryaa.co.in

Andhra Pradesh

వాలంటీర్లు దూరంగా ఉండాల్సిందే

లోక్ సభ ఎన్నికలకు, పలు రాష్ట్రాలను అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా చీఫ్ ఎలెక్షన్ కమిషన్ మాట్లుడుతూ ఎన్నికల ప్రక్రియ గురించి వివరించారు. ఈ క్రమంలో ఏపీలోని వాలంటీర్లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో వాలంటార్లు, తాత్కాలిక సిబ్బంది పాల్గొనరాదని స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను యాప్ లో చూడొచ్చని చెప్పారు. అవకతవకలపై సీ-యాప్ లో ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. అక్రమాలు, నగదు పంపిణీలకు సంబంధించిన ఫొటోలను ఈ యాప్ ద్వారా అప్ లోడ్ చేయొచ్చని తెలిపారు. హింసకు పాల్పడే వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తామని చెప్పారు.

LEAVE A RESPONSE