Suryaa.co.in

Andhra Pradesh

16నెలలు జైలులో ఉన్న దొంగకు ఓటేయడం ప్రజలు చేసిన తప్పే

అయిదేళ్లు రాష్ట్రానికి అన్యాయం చేసిన వాడికి ఏవిధంగా ప్రజలు ఓట్లు వేస్తారు? జగన్మోహన్ రెడ్డీ… పులివెందులలో కూడా టిడిపి జెండా ఎగురవేస్తాం… కాసుకో.
పేదవాడి ఆకలి కేకలనుంచి పుట్టిన పార్టీ టిడిపి
జగన్ పేదవాడినంటూ కొత్తరాగం అందుకున్నాడు
సాక్షి పేపర్, టీవి, బెంగుళూరు, హైదరాబాద్, తాడేపల్లి ప్యాలెస్ లు ఎవరివి?
500కోట్లతో రుషికొండలో కట్టిన ప్యాలెస్ ఎవరిది?
టిడిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారి పేర్లు రాసుకున్నాం
లోకేష్ కూడా ఎర్రబుక్ లో రాశారు
ఆరుమాసాల్లో చక్రవడ్డీతో సెటిల్ మెంట్ చేస్తాం.

– టెక్కలి శంఖారావం సభలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు

తెలుగుదేశం పార్టీకి రాబోయే ఏళ్లు నాయకత్వం వహించగల దమ్మున్న నేత నారా లోకేష్. ఒక్క ఫోన్ కాల్ తో వేలమంది కార్యకర్తలు శంఖారావంలో పాల్గొనేందుకు తరలివచ్చారు. నా చివరి శ్వాస వరకు టెక్కలి ప్రజలకు, ప్రజాసేవకే అంకితమవుతా. అన్న ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన టెక్కలికి నేను ఎమ్మెల్యే కావడం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడ్ని కావడం నా అదృష్టం.

మీ అందరి సహకారంతో 5సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా. అధికారమంటే ప్రజలకు సేవచేయడం, కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవడం అని భావించాను. చీమకు కూడా హాని తలపెట్టకుండా సేవలందించాను. ఎంతోమంది ముఖ్యమంత్రులను, మంత్రులను చూశాను, 2019లో ఏపీ ప్రజలు దగా పడ్డారు. ఒక్క అవకాశం పేరుతో ఒక దుర్మార్గుడికి రాష్ట్రప్రజలు ముఖ్యమంత్రిని చేశారు, ఇది ముమ్మాటికీ ప్రజలు చేసిన తప్పిదమే.

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షకోట్లు దోచి, 16నెలలు జైలులో ఉన్న దొంగకు ఓటేయడం ప్రజలు చేసిన తప్పే. మన పార్టీలేకుండా చేయాలని తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేశారు, జైలులో పెడితే పారిపోతామనుకున్నారు. తెలుగుదేశం గాలికి పుట్టలేదు, పేదవాడి ఆకలి కేకలనుంచి పుట్టిన పార్టీ టిడిపి. ఈరోజు చెబుతున్నా… రాష్ట్రంలో 175స్థానాలను రాబోయే ఎన్నికల్లో టిడిపి గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డీ… పులివెందులలో కూడా టిడిపి జెండా ఎగురవేస్తాం… కాసుకో.

అయిదేళ్లు రాష్ట్రానికి అన్యాయం చేసిన వాడికి ఏవిధంగా ప్రజలు ఓట్లు వేస్తారు? రాష్ట్రాన్ని సర్వనాశనంచేసిన సిఎం జగన్. బటన్ నొక్కి 2.5లక్షల కోట్లు పేదలకు ఇచ్చానంటున్న జగన్… అప్పుతెచ్చిన 12లక్షల కోట్లు ఏంచేశాడు? రాబోయే ఎన్నికల్లో ఓడిపోతానని చెప్పి, నేను పేదవాడినంటూ కొత్తరాగం అందుకున్నాడు. సాక్షి పేపర్, టీవి, బెంగుళూరు, హైదరాబాద్, తాడేపల్లి ప్యాలెస్ లు ఎవరివి? 500కోట్లతో రుషికొండలో కట్టిన ప్యాలెస్ ఎవరిది?

రాజధాని అంటే ఉత్తరాంధ్ర ప్రజలు మరోమారు మోసపోయి ఓట్లు వేస్తారనుకున్నాడు జగన్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు జగన్ కు కర్రు కాల్చి వాతపెట్టారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో 34స్థానాలు, టిడిపి-జనసేన కలిసి 160స్థానాలు గెలుస్తాయి. 2014-19 నడుమ కాలం టెక్కలి నియోజకవర్గానికి స్వర్ణయుగం, ఎవరూ చేయనంత సంక్షేమం చేశాను. అర్ధరాత్రి ఒంటిగంటకు పోన్ చేసినా ప్రజల కష్టాలు విన్నాను. ఈ 60రోజులు టెక్కలి కార్యకర్తలు కష్టపడండి, 50వేల మెజారిటీతో టిడిపి గెలిపించండి.

రాబోయే ప్రభుత్వంలో లోకేష్ కీలకపాత్ర వహిస్తారు, ఆయన సహకారంతో టెక్కలి నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా మారుస్తా. టెక్కలిలో ఇంకా రెండు పనులు చేయాల్సి ఉంది, ప్రతిఇంటికీ స్వచ్చమైన తాగునీరు అందించాలి. జిల్లాకు వంశధార జీవనాడి, టిడిపి హయాంలో 72శాతంపూర్తిచేశాం, వైసిపి వచ్చాక తట్టమట్టి తీయలేదు, వంశధార కాల్వలన్నీ పూడిపోయాయి.

అయిదేళ్లుగా ప్రతిరైతు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హీరమండలం నుంచి వజ్జపుకొత్తూరు, మర్రిపాలెం వరకు కాల్వలు తవ్వించాల్సిఉంది. వెయికోట్లు అయినా ఈ పనులు పూర్తిచేయాలి. మన ప్రభుత్వం వచ్చాక కాల్వల లైనింగ్ చేసి నీరు అందించేందుకు సహకరించండి. టిడిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారి పేర్లు రాసుకున్నాం, లోకేష్ కూడా ఎర్రబుక్ లో రాశారు, ఆరుమాసాల్లో చక్రవడ్డీతో సెటిల్ మెంట్ చేస్తాం.

 

LEAVE A RESPONSE